News February 11, 2025
ఢిల్లీలో ఓడితే పంజాబ్ MLAలతో AK భేటీ: కాంగ్రెస్ సెటైర్లు

ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కళ్లలో భయం కనిపిస్తోందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఢిల్లీలో పార్టీ ఓడిపోతే పంజాబ్ MLAలతో మీటింగ్ పెట్టారని సెటైర్లు వేసింది. ఆయన మరోసారి CM (పంజాబ్కు) అవ్వాలనుకుంటున్నారని పేర్కొంది. మరోవైపు 30 మంది MLAలు టచ్లో ఉన్నారన్న కాంగ్రెస్ ఇప్పుడు ఢిల్లీలో ఎందరున్నారో లెక్కించాలంటూ పంజాబ్ CM మాన్ సవాల్ విసిరారు. ఢిల్లీ ఓటమి అనుభవాన్ని పంజాబ్లో ఉపయోగించుకుంటామన్నారు.
Similar News
News January 29, 2026
కుసుమలో ఆకుమచ్చ తెగులు-నివారణకు సూచనలు

ప్రస్తుతం పెరిగిన మంచు తీవ్రత, వాతావరణంలో 70 శాతం కంటే ఎక్కువ తేమ ఉన్నప్పుడు కుసుమ పంటలో ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఆకులపై గోధుమ రంగు గుండ్రటి మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలను గమనిస్తే లీటరు నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ కలిపి తొలిసారి పిచికారీ చేయాలి. మళ్లీ 7 నుంచి 10 రోజుల వ్యవధిలో రెండోసారి పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News January 29, 2026
కొలంబోకి టికెట్లు బుక్ చేసుకున్న పాకిస్థాన్!

WC కోసం కొలంబో(SL)కు వెళ్లేందుకు పాకిస్థాన్ టీమ్ టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పాక్ కొలంబో వెళ్తోందని ‘టెలికమ్ ఆసియా స్పోర్ట్’ పేర్కొంది. తమ రిక్వెస్ట్కు ICC నో చెప్పడంతో బంగ్లా WC నుంచి వైదొలిగింది. దానికి మద్దతుగా తాము కూడా బాయ్కాట్ చేసే విషయాన్ని ఆలోచిస్తామని పాక్ చెప్పింది. అయితే తమ పార్టిసిపేషన్పై సోమవారం PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ తుది నిర్ణయం ప్రకటించే అవకాశముంది.
News January 29, 2026
లిక్కర్ కేసులో ముగ్గురికి బెయిల్

ఏపీ లిక్కర్ కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బెయిలిచ్చింది. రాజ్ కసిరెడ్డి, ముప్పిడి అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్లను కొట్టేసింది.


