News September 21, 2024
అక్కినేని ఫ్యామిలీ PHOTO

ANR శతజయంతి వేడుకల్లో అక్కినేని ఫ్యామిలీ సందడి చేసింది. నాగేశ్వరరావు ఇద్దరు కొడుకులు వెంకట్, నాగార్జున, ముగ్గురు కూతుళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఒకే వేదికపై కనిపించారు. హీరోలు నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్తో పాటు నటి సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫ్యామిలీ ఫొటోను అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Similar News
News October 26, 2025
VH ట్రోఫీలో RO-KO ఆడతారా? గిల్ ఏమన్నారంటే?

విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీ ఆడే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని భారత కెప్టెన్ గిల్ తెలిపారు. SAతో ODI సిరీస్ అనంతరం సెలక్టర్లు దీనిపై RO-KOతో చర్చిస్తారని ప్రెస్ కాన్ఫరెన్స్లో వెల్లడించారు. సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లందరూ డొమెస్టిక్ టోర్నీల్లో ఆడాల్సిందేనని చీఫ్ సెలక్టర్ అగర్కర్ గతంలోనే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ కోసం రోహిత్, కోహ్లీని VH ట్రోఫీలో ఆడాలని సూచించే అవకాశముంది.
News October 26, 2025
ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు శంభాజీనగర్ స్టేషన్గా మార్పు

MHలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి శంభాజీనగర్ స్టేషన్గా మార్చినట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. మూడేళ్ల క్రితం ఔరంగాబాద్ సిటీ పేరునూ ఛత్రపతి శంభాజీనగర్గా మార్చిన సంగతి తెలిసిందే. పేర్ల మార్పును కొందరు సమర్థిస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. పేర్లు మారిస్తే రైళ్లలో అందరికీ సీట్లు దొరుకుతాయా? ప్లాట్ఫామ్స్ క్లీన్గా ఉంటాయా? టికెట్లు వేగంగా బుక్ అవుతాయా అని ప్రశ్నిస్తున్నారు.
News October 26, 2025
తాజా సినీ ముచ్చట్లు

☛ చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీ భేటీ
☛ నిఖిల్ సిద్ధార్థ ‘స్వయంభు’ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న రిలీజయ్యే అవకాశం: సినీ వర్గాలు
☛ సుందర్.సి దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా సినిమా? ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్
☛ ‘కుమారి 21F’ మూవీకి సీక్వెల్గా త్వరలో తెరపైకి ‘కుమారి 22F’.. నిర్మాతలుగా సుకుమార్, ఆయన సతీమణి తబిత వ్యవహరించనున్నట్లు సినీ వర్గాల సమాచారం


