News October 20, 2024
TDP MLC అభ్యర్థులుగా ఆలపాటి, పేరాబత్తుల!

AP: రెండు పట్టభద్ర ఎమ్మెల్యే స్థానాలకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్(కృష్ణా-గుంటూరు), పేరాబత్తుల రాజశేఖర్(ఉ.గో) పేర్లను టీడీపీ అధిష్ఠానం ఖరారుచేసింది. వీరికి మద్దతు ఇవ్వాలని పవన్, పురందీశ్వరిని టీడీపీ స్టేట్ చీఫ్ పల్లా శ్రీనివాసరావు కోరారు. తమ పార్టీ నేతలతో చర్చించి ఒకట్రెండు రోజుల్లో అభిప్రాయం చెబుతామని వారు తెలిపినట్లు సమాచారం. వారు సానుకూలత వ్యక్తం చేయగానే పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.
Similar News
News January 18, 2026
ట్రంప్ వద్దకు నోబెల్ శాంతి.. స్పందించిన కమిటీ

ట్రంప్నకు వెనిజులాకు చెందిన మచాడో తన <<18868941>>శాంతి<<>> బహుమతిని ఇవ్వడంపై భిన్నమైన స్పందన రాగా తాజాగా నోబెల్ కమిటీ స్పందించింది. మెడల్ ఎవరి వద్ద ఉన్నా తాము ప్రకటించిన విజేతలో మార్పు ఉండదని తెలిపింది. విజేతలు తీసుకునే నిర్ణయాలపై అవార్డు కమిటీ ఎలాంటి కామెంట్లు చేయబోదని పేర్కొంది. మెడల్ను అమ్మడం, దానం చేయడం వంటి వాటిపై పరిమితులు లేవని తెలిపింది. గతంలోనూ పలువురు మెడల్స్ను డొనేట్/అమ్మడం చేసినట్లు వెల్లడించింది.
News January 18, 2026
ప్చ్.. రో‘హిట్’ అవ్వలేదు

న్యూజిలాండ్తో సిరీస్లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ నిరాశపర్చారు. మూడో వన్డేలో 11 పరుగులే చేసి ఫౌల్క్స్ బౌలింగ్లో వెనుదిరిగారు. సిరీస్ మొత్తంగా 61 పరుగులే చేశారు. మరో ఆరు నెలల వరకు వన్డే మ్యాచ్లు లేవు. హిట్ మ్యాన్ నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన లేకపోవడం ఫ్యాన్స్ను నిరాశకు గురిచేస్తోంది. మళ్లీ IPL-2026లోనే రోహిత్ ఆటను చూడవచ్చు. ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ 3వ ర్యాంకులో కొనసాగుతున్నారు.
News January 18, 2026
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. నేషనల్ పార్కు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నిన్న నలుగురు, ఇవాళ ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలంలో AK-47 సహా 6 తుపాకులు, పేలుడు పదార్థాలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.


