News August 26, 2024
తెలుగు రాష్ట్రాల్లోనే మద్యం ‘కిక్కు’ ఎక్కువ

TG: దేశంలో తెలుగు రాష్ట్రాల్లోనే మద్యం వినియోగం ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ విభాగం నిపెప్ వెల్లడించింది. తెలంగాణలో వార్షిక సగటు తలసరి వినియోగం రూ.1,623 ఉండగా, ఏపీలో రూ.1,306గా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో పంజాబ్ 1,245, ఛత్తీస్గఢ్ రూ.1,227, ఒడిశా రూ.1,156 ఉన్నాయి. మద్యంపై వస్తున్న ఆదాయం రాష్ట్రాలకు మూడో అతిపెద్ద ఆదాయవనరుగా ఉందని తెలిపింది. అత్యధికంగా గోవా 722% ఆదాయం పొందుతున్నట్లు పేర్కొంది.
Similar News
News November 16, 2025
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News November 16, 2025
AP న్యూస్ రౌండప్

* విశాఖ కైలాసగిరిపై 50 అంతస్తుల ఐకానిక్ భవనం, కొత్త వలస వద్ద 120 ఎకరాల్లో థీమ్ బేస్డ్ సిటీ నిర్మిస్తాం: మంత్రి నారాయణ
* టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ మృతి కేసుపై మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ను పోలీసులు నిర్వహించారు. రైలు 120కి.మీ వేగంతో వెళ్తుండగా 3 బోగీల్లో నుంచి 3 బొమ్మలను తోశారు. త్వరలో నివేదిక సిద్ధం చేయనున్నారు.
* ప్రపంచ పటంలో హిందూపురం నిలిచేలా అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే బాలకృష్ణ
News November 16, 2025
ఇతిహాసాలు క్విజ్ – 68 సమాధానాలు

ప్రశ్న: కురుక్షేత్రాన్ని 3 బాణాలతో ముగించగల యోధుడు ఎవరు?
జవాబు: భీముడి మనవడు. ఘటోత్కచుడి కుమారుడు అయిన బార్బరీకుడికి శివుడి ద్వారా 3 బాణాలతో యుద్ధాన్ని ముగించగల శక్తి లభించింది. ఆయన ఓడిపోయే పక్షం వైపు పోరాడతానని ప్రమాణం చేయడంతో యుద్ధం క్షణాల్లోనే ముగిసి, ఎవరూ మిగలరని గ్రహించి, ధర్మస్థాపన కోసం శ్రీకృష్ణుడు, బార్బరీకుడి శిరస్సును దానంగా తీసుకొని, పోరులో పాల్గొనకుండా చేశాడు.<<-se>>#Ithihasaluquiz<<>>


