News August 26, 2024

తెలుగు రాష్ట్రాల్లోనే మద్యం ‘కిక్కు’ ఎక్కువ

image

TG: దేశంలో తెలుగు రాష్ట్రాల్లోనే మద్యం వినియోగం ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ విభాగం నిపెప్ వెల్లడించింది. తెలంగాణలో వార్షిక సగటు తలసరి వినియోగం రూ.1,623 ఉండగా, ఏపీలో రూ.1,306గా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో పంజాబ్ 1,245, ఛత్తీస్‌గఢ్ రూ.1,227, ఒడిశా రూ.1,156 ఉన్నాయి. మద్యంపై వస్తున్న ఆదాయం రాష్ట్రాలకు మూడో అతిపెద్ద ఆదాయవనరుగా ఉందని తెలిపింది. అత్యధికంగా గోవా 722% ఆదాయం పొందుతున్నట్లు పేర్కొంది.

Similar News

News December 6, 2025

భారత్‌లో మరో రష్యన్ న్యూక్లియర్ ప్లాంట్!

image

రష్యా తయారుచేసిన రియాక్టర్లతో భారత్‌లో రెండో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించే అవకాశాలపై చర్చించినట్టు రెండు దేశాలు ప్రకటించాయి. ఈ ప్రాజెక్టుకు స్థలాన్ని కేటాయించేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపాయి. ప్రైవేట్ న్యూక్లియర్ ఆపరేటర్లకు అవకాశం ఇచ్చే సంస్కరణలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఇప్పటికే తమిళనాడు కూడంకుళంలో ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన 2 రష్యన్‌ VVERలను భారత్ నిర్వహిస్తోంది.

News December 6, 2025

విమానానికి బాంబు బెదిరింపు.. తీవ్ర కలకలం

image

TG: ఢిల్లీ-హైదరాబాద్ ఎయిరిండియా విమానంలో బాంబు పెట్టామంటూ వచ్చిన ఈ-మెయిల్ తీవ్ర కలకలం రేపింది. వెంటనే ఫ్లై‌ట్‌ను శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేయగా దాని చుట్టూ ఫైర్ ఇంజిన్లను సిద్ధం చేశారు. బాంబ్ స్క్వాడ్స్ ప్రయాణికులను దించేసి తనిఖీలు చేపట్టారు. ప్యాసింజర్లు లగేజ్‌ను ఎయిర్పోర్ట్ సిబ్బందికి హ్యాండోవర్ చేయాలని ఆదేశించారు. ఈ ఫ్లైట్‌లో పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.

News December 5, 2025

పవనన్నకు థాంక్స్: లోకేశ్

image

AP: చిలకలూరిపేట ZPHSలో నిర్వహించిన మెగా PTM 3.Oకు హాజరైన డిప్యూటీ సీఎం పవన్‌కు మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ‘హైస్కూలు లైబ్ర‌రీకి పుస్త‌కాలు, ర్యాక్‌లు, 25 కంప్యూట‌ర్లు అందిస్తామ‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న‌న్న‌కు ధ‌న్య‌వాదాలు. ఏపీ మోడ‌ల్ ఆఫ్ ఎడ్యుకేష‌న్ ద్వారా మ‌న విద్యావ్య‌వ‌స్థ‌ను 2029 నాటికి దేశంలోనే నంబర్ వ‌న్‌గా తీర్చిదిద్దేందుకు Dy.CM అందిస్తున్న స‌హ‌కారం చాలా గొప్పది’ అని ట్వీట్ చేశారు.