News August 26, 2024

తెలుగు రాష్ట్రాల్లోనే మద్యం ‘కిక్కు’ ఎక్కువ

image

TG: దేశంలో తెలుగు రాష్ట్రాల్లోనే మద్యం వినియోగం ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ విభాగం నిపెప్ వెల్లడించింది. తెలంగాణలో వార్షిక సగటు తలసరి వినియోగం రూ.1,623 ఉండగా, ఏపీలో రూ.1,306గా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో పంజాబ్ 1,245, ఛత్తీస్‌గఢ్ రూ.1,227, ఒడిశా రూ.1,156 ఉన్నాయి. మద్యంపై వస్తున్న ఆదాయం రాష్ట్రాలకు మూడో అతిపెద్ద ఆదాయవనరుగా ఉందని తెలిపింది. అత్యధికంగా గోవా 722% ఆదాయం పొందుతున్నట్లు పేర్కొంది.

Similar News

News September 18, 2025

వైసీపీ ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌దే నిర్ణయం: అచ్చెన్నాయుడు

image

AP: యూరియాతో సహా అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అన్నారు. YCP నేతలు ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. కుంటిసాకులతో సభకు రావట్లేదని, వైసీపీ MLAల అనర్హత వేటుపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రతిపక్ష నేతగానూ జగన్ పనికిరారని జనం పక్కనపెట్టారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రతిపక్ష హోదా అడగటం మాని, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు.

News September 18, 2025

అరాచకమే.. సందీప్ వంగాతో మహేశ్ మూవీ?

image

రాజమౌళితో సినిమా తర్వాత మహేశ్ బాబు చేసే మూవీ విషయమై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీని కోసం మైత్రీ మూవీ మేకర్స్, ఏషియన్ సునీల్ పోటీలో ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మూవీ చేయాలని మహేశ్‌ను సునీల్ కోరినట్లు తెలిపాయి. కాల్షీట్ల ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందన్నాయి. దీంతో సందీప్, మహేశ్ కాంబినేషన్ కుదిరితే అరాచకమేనని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.

News September 18, 2025

ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం!

image

ప్లాస్టిక్ నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో నిషేధించాలని నిర్ణయించింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. డిసెంబర్‌ 31 నాటికి ఆంధ్రప్రదేశ్‍లో చెత్తను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే అమరావతి సచివాలయంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నారు.