News August 30, 2024

ఏపీలో తెలంగాణ తరహా మద్యం విధానం?

image

APలో తెలంగాణ తరహా మద్యం విధానమే అమలు చేసేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేటుకే అప్పగించనుండగా, దరఖాస్తులకు రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజు విధించే ఆలోచనలో ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మద్యం విధానాలపై కమిటీ అధ్యయనం చేసింది. SEPలో మద్యం విధానం ఖరారుతో పాటు దరఖాస్తులు స్వీకరించి లైసెన్సులు అందజేసే అవకాశముంది. OCT 1నాటికి కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉంది.

Similar News

News December 31, 2025

అయామ్ సెమనీ కోడికి ఎందుకు అంత ధర?

image

అయామ్ సెమనీ కోడి ఇండోనేషియాలోని జావా ద్వీపంలో కనిపిస్తుంది. ఈ కోడి చర్మం, మాంసం, ఎముకలు, అవయవాలు, ఈకలు అన్నీ నలుపే. రక్తం ముదురు ఎరుపుగా ఉంటుంది. గుడ్లు మాత్రం బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. వాతావరణ పరిస్థితులు, జన్యు మార్పుల వల్ల సెమనీ కోళ్లకు ఈ రంగు వచ్చింది. ఇండోనేషియా ప్రజలు ఈ కోడిని పవిత్రమైనదిగా, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నదిగా నమ్ముతారు. ఈ సెంటిమెంట్ వల్లే ఈ కోడి ధర కిలో రూ.2 లక్షలకు పైనే ఉంటుంది.

News December 31, 2025

మహిళలకు అత్యంత అనుకూలమైన దేశం డెన్మార్క్‌

image

ఉమెన్‌ పీస్‌ అండ్‌ సెక్యూరిటీ (WPS) ఇండెక్స్‌-2025లో మహిళలకు అత్యంత అనుకూలమైన దేశంగా డెన్మార్క్‌ అగ్ర స్థానంలో నిలిచింది. ఉద్యోగ, ఉపాధితోపాటు ప్రతి రంగంలోనూ ఇక్కడి మహిళలకు విస్తృతమైన అవకాశాలు, భద్రత లభిస్తోంది. లింగవివక్ష, మహిళలపై హింస ఉండవు. కీలక నిర్ణయాల్లో మహిళల ప్రాతినిధ్యం, బలమైన చట్టాలు, సురక్షిత వాతావరణం, ఆరోగ్యం-చదువులో ఉన్నత ఫలితాలు సాధించడం వంటివి దీన్ని లెక్కించే సూచికలు.

News December 31, 2025

కోటిన్నర ఎకరాలకు రైతు భరోసా!

image

TG: గత సీజన్‌లో ఇచ్చినట్లుగానే ఈసారి కోటిన్నర ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యాసంగి సీజన్ పెట్టుబడి సాయం కింద సంక్రాంతి నాటికి రైతు భరోసా నగదు రైతు ఖాతాల్లో జమ చేసే యోచనలో ఉంది. సాగు భూములకు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటికీ ఆ లెక్కలు తేలలేదు. ఈ పథకం ద్వారా ఎకరానికి రూ.6వేల చొప్పున ఏడాదికి రెండు విడతల్లో నగదు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.