News April 11, 2024
ALERT.. ఉమ్మడి తూ.గోలో భానుడి భగభగ

ఉమ్మడి తూ.గో జిల్లా వ్యాప్తంగా భానుడి భగభగలతో ప్రజలు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో కొన్నిచోట్ల 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉదయం 10 గంటలకే ప్రజలు ఇండ్లకు పరిమితమవుతున్నారు. దీనికి తోడు వడగాల్పులు కూడా మొదలవ్వడంతో బయటకు రావడానికి జంకుతున్నారు. వృద్ధులు, పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండల తీవ్రతకు నగరంలోని పలు ప్రధాన కూడళ్లతో పాటు వీధులూ నిర్మానుష్యమయ్యాయి.
Similar News
News September 18, 2025
పెద్దవం, ఐ.పంగిడీ గ్రామాల్లో కలెక్టర్ కీర్తి చేకూరి పర్యటన

ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో పశువుల చికిత్సలకు ప్రత్యేక వైద్యుల బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం తాళ్లపూడి మండలం పెద్దేవం, ఐ.పంగిడీ గ్రామాల్లో కలెక్టర్ పర్యటించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. గేదెల వ్యాధి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
News September 18, 2025
కలెక్టర్ను కలిసిన రాజమహేంద్రవరం జైల్ సూపరింటెండెంట్

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరిను గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్లో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాహుల్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జైళ్లలో పరిస్థితిని ఆమెకు వివరించారు. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ది పథంలో నడపాలని కలెక్టర్ అన్నారు.
News September 18, 2025
నూతన కలెక్టర్ కీర్తి చేకూరిని కలిసిన రుడా ఛైర్మన్

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి చేకూరిని గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టరేట్లో గురువారం ఆమెను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రుడా పరిధిలోని అంశాలను, పలు సమస్యలను ఆమెకు వివరించారు. రుడా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.