News May 12, 2024
ALERT: ఉమ్మడి తూ.గో.లో పిడుగులకు ఛాన్స్

ఉమ్మడి తూ.గో జిల్లాలో నేడు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఏపీలో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఆదివారం అక్కడ పిడుగులు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News February 9, 2025
దేవరపల్లి హైవేపై ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

దేవరపల్లి మండలం గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండలం సంగాయిగూడెం గ్రామానికి చెందిన భార్యాభర్తలు ముగ్గురు పిల్లలతో కలిసి కొవ్వూరు వైపు బైక్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి ప్రమాదానికి గురయ్యారు. భార్య, భర్త, కుమారుడిని గోపాలపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా మిగిలిన ఇద్దరు కుమార్తెలను మరో ఆసుపత్రికి తరలించారు.
News February 9, 2025
రోడ్డు ప్రమాదంలో తాడేపల్లిగూడెం మహిళ మృతి

ప్రత్తిపాడులో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడేపల్లిగూడెం(M) కొండ్రుపోలుకు చెందిన లక్ష్మి మృతిచెందింది. భర్త సత్యనారాయణతో దువ్వలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రత్తిపాడు హైవేపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయమై చనిపోయింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI స్వామి తెలిపారు.
News February 9, 2025
తూ.గో: 26 మంది ఉద్యోగులకు షాకోజ్ నోటీసులు

విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న 26 మంది ఉద్యోగులకు శనివారం కలెక్టర్ షాకోజ్ నోటీసులు జారీ చేశారు. వారిలో 12 మంది డిప్యూటీ తహశీల్దార్లు , 12 మంది మండల సర్వేయర్లు, ఇద్దరు గ్రామ సర్వేయర్లు ఉన్నారు. రాజమండ్రి రూరల్, పెరవలి, గోపాలపురం, చాగల్లు, గోకవరం, కడియం, దేవరపల్లి, నల్లజర్ల, బిక్కవోలు, కోరుకొండ, సీతానగరం, రాజానగరం మండలాల డిప్యూటీ తహశీల్దార్లు ఉన్నారు.