News March 26, 2025
ALERT.. బాపట్లలో 28న జరిగే కార్యక్రమం రద్దు

ఎస్టీలు, దివ్యాంగుల కొరకు శుక్రవారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఈనెల 28వ తేదీన తాత్కాలికంగా రద్దు చేసినట్లు బాపట్ల కలెక్టర్ జె.వెంకట మురళి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనివార్య కారణాలు, పరిపాలన సౌలభ్యంలో భాగంగా మార్చి నెలలో జరగవలసిన ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ మాత్రమే రద్దు చేశామన్నారు. ఫిర్యాదుదారులు ఎవరూ శుక్రవారం కలెక్టరేట్కి రావద్దని సూచించారు.
Similar News
News November 21, 2025
టాటా డిజిటల్లో భారీగా లేఆఫ్లు

టాటా గ్రూప్లో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. TCSలో ఉద్యోగుల తొలగింపు తరువాత, ఇప్పుడు టాటా డిజిటల్లోనూ ఎంప్లాయీస్ను తగ్గించేందుకు సిద్ధమవుతోంది. టాటా న్యూ పనితీరు గత రెండేళ్లుగా ఊహించిన స్థాయిలో లేదు. దీంతో కొత్త CEO సజిత్ శివానందన్ పునర్వ్యవస్థీకరణను ప్రారంభించారు. ఇందులో భాగంగా TATA NEUలోని 50% ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. అన్ని డిజిటల్ సేవలను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు.
News November 21, 2025
UG&PG సైన్స్ స్కాలర్షిప్ నేడే లాస్ట్ డేట్

సైన్స్ విద్యార్థినులకు L’Oréal India అందించే స్కాలర్షిప్ అప్లికేషన్ గడువు ఈరోజుతో ముగుస్తోంది. UG&PG ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినుల మినహా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వార్షికాదాయం 6 లక్షల్లోపు, ఇంటర్లో 85%, డిగ్రీలో 60% మార్కులు వచ్చి ఉండాలి. UG విద్యార్థులకు రూ.62,500, PG & PhD విద్యార్థులకు రూ.1,00,000 వరకు స్కాలర్షిప్ అందుతుంది. వెబ్సైట్: <
News November 21, 2025
BREAKING: మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ బదిలీ.. కొత్త ఎస్పీగా శబరీష్

మహబూబాబాద్ జిల్లా నూతన ఎస్పీగా శబరీష్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో శబరీష్ ములుగు జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వహిస్తూ బదిలీల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లాకు వచ్చారు. ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ను ములుగు జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులను వెలువరించింది.


