News March 26, 2025

ALERT.. బాపట్లలో 28న జరిగే కార్యక్రమం రద్దు

image

ఎస్టీలు, దివ్యాంగుల కొరకు శుక్రవారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఈనెల 28వ తేదీన తాత్కాలికంగా రద్దు చేసినట్లు బాపట్ల కలెక్టర్ జె.వెంకట మురళి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనివార్య కారణాలు, పరిపాలన సౌలభ్యంలో భాగంగా మార్చి నెలలో జరగవలసిన ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ మాత్రమే రద్దు చేశామన్నారు. ఫిర్యాదుదారులు ఎవరూ శుక్రవారం కలెక్టరేట్‌కి రావద్దని సూచించారు.

Similar News

News November 12, 2025

CWCలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

image

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్(CWC) 11 కాంట్రాక్ట్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈనెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB/LLM, MBA/PGDM, MSc(స్టాటిస్టిక్స్), BSc(స్టాటిస్టిక్స్), BBA, ఎంటెక్, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News November 12, 2025

విడాకుల వార్తలకు చెక్ పెట్టిన శర్వానంద్!

image

టాలీవుడ్ హీరో శర్వానంద్, ఆయన భార్య రక్షిత విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వార్తలకు ఓ ఇంటర్వ్యూలో ఆయన ఇన్‌డైరెక్ట్‌గా చెక్ పెట్టారు. ‘తండ్రి అయ్యాకే ఆరోగ్యంపై దృష్టి పెట్టా. అంతకుముందు వర్కౌట్స్ చేసేవాడిని కాదు. నా కుటుంబం కోసం ఆరోగ్యంగా, స్ట్రాంగ్‌గా ఉండాలని డిసైడయ్యా’ అని పేర్కొన్నారు. 2019లో యాక్సిడెంట్ తర్వాత తన బరువు 92kgsకి పెరిగిందని, కష్టపడి 22kgs తగ్గానన్నారు.

News November 12, 2025

రాయలసీమ వర్సిటీలో 4వ స్నాతకోత్సవం

image

కర్నూలు నగర శివారులోని రాయలసీమ యూనివర్సిటీలో బుధవారం 4వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.