News March 26, 2025
ALERT.. బాపట్లలో 28న జరిగే కార్యక్రమం రద్దు

ఎస్టీలు, దివ్యాంగుల కొరకు శుక్రవారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఈనెల 28వ తేదీన తాత్కాలికంగా రద్దు చేసినట్లు బాపట్ల కలెక్టర్ జె.వెంకట మురళి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనివార్య కారణాలు, పరిపాలన సౌలభ్యంలో భాగంగా మార్చి నెలలో జరగవలసిన ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ మాత్రమే రద్దు చేశామన్నారు. ఫిర్యాదుదారులు ఎవరూ శుక్రవారం కలెక్టరేట్కి రావద్దని సూచించారు.
Similar News
News November 23, 2025
విశాఖ: కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా గాయత్రి

కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం విశాఖ జిల్లా అధ్యక్షురాలిగా కాండవ గాయత్రి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు అడ్డాల వెంకటవర్మ నియామకపత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. జిల్లా కమిటీ నియమకం పూర్తిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు.
News November 23, 2025
సిరిసిల్ల కలెక్టరేట్లో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు

పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో (కలెక్టరేట్) ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి అధికారులు ఘనంగా నివాళులర్పించారు.
News November 23, 2025
జగిత్యాల: NMMS పరీక్ష నిర్వహణపై అధికారుల సమీక్ష

జాతీయ స్థాయి ప్రతిభ ఉపకార వేతనాల ఎంపిక కోసం ఆదివారం NMMS పరీక్ష జరిగింది. జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి కేంద్రాలు ఏర్పాటు చేశారు. జగిత్యాల ఉన్నత పాఠశాల కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాజ గౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాము పరిశీలించారు. విద్యార్థుల హాజరు, పరీక్షా కేంద్ర సౌకర్యాలను తనిఖీ చేసి పకడ్బందీగా పరీక్ష నిర్వహించాలని సూచించారు.


