News March 26, 2025

ALERT.. బాపట్లలో 28న జరిగే కార్యక్రమం రద్దు

image

ఎస్టీలు, దివ్యాంగుల కొరకు శుక్రవారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఈనెల 28వ తేదీన తాత్కాలికంగా రద్దు చేసినట్లు బాపట్ల కలెక్టర్ జె.వెంకట మురళి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనివార్య కారణాలు, పరిపాలన సౌలభ్యంలో భాగంగా మార్చి నెలలో జరగవలసిన ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ మాత్రమే రద్దు చేశామన్నారు. ఫిర్యాదుదారులు ఎవరూ శుక్రవారం కలెక్టరేట్‌కి రావద్దని సూచించారు.

Similar News

News April 21, 2025

ఆనందపురం: రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జైన శరీరం

image

ఆనందపురం మామిడిలోవ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి మృతి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆనవాళ్లు గుర్తు పట్టలేనంతగా మృతదేహం నుజ్జునుజ్జైంది. హిట్ అండ్ రన్ కేసుగా భావిస్తూ దర్యాప్తు చేస్తున్నామని ఆనందపురం ఎస్సై సంతోష్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 21, 2025

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు

image

ఇండియన్ షేర్ మార్కెట్ లాభాల బాటలో దూసుకుపోతుంది. ఉదయం 518 పాయింట్లు లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ 939 పాయింట్లు పెరిగి 79,492 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 329 పాయింట్లు లాభపడి 24,158 వద్ద కొనసాగుతోంది. టాటా, ఐడియా, HDFC, ఏంజిల్ వన్ కంపెనీలు టాప్ గైనర్‌లుగా ఉన్నాయి.

News April 21, 2025

నిర్మల్‌లో వడదెబ్బతో ఇద్దరు మృతి

image

వడదెబ్బతో ఇద్దరు మృతి చెందిన ఘటన సోమవారం నిర్మల్ పట్టణంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కురన్నపేట్ కాలనీకి చెందిన శంకర్(48), రాజు (42) ఆదివారం పోచమ్మ పండుగ ఉండటంతో డప్పు కొట్టడానికి వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చాక నీరసంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతి చెందారు. మృతులు నిరుపేద కుటుంబానికి చెందిన వారని.. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

error: Content is protected !!