News January 1, 2025

ALERT: రత్నాచల్ టైమింగ్స్ మారాయి..!

image

విజయవాడ-విశాఖపట్నం(నం. 12718) మధ్య ప్రయాణించే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రేపు జనవరి 1 నుంచి ఈ రైలు ఉదయం 6 గంటలకు విజయవాడలో బయలుదేరుతుందని చెప్పారు. గతంలో 6.15కి ఈ రైలు విజయవాడలో కదిలేదన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించే ప్రక్రియలో భాగంగా రైళ్ల షెడ్యూల్ మార్చామని.. ప్రయాణికులు గమనించాలని కోరారు.

Similar News

News January 13, 2025

అధిష్ఠానం వద్దకు నూజివీడు తెలుగు తమ్ముళ్ల రగడ 

image

నూజివీడులో తెలుగు తమ్ముళ్ల రగడ అధిష్ఠానం వద్దకు చేరింది. మంత్రి పార్థసారథి వైసీపీ నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలినాటి నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని జెండా పట్టిన వారికి కాకుండా, అధికారంలోకి రాగానే టీడీపీ తీర్థం తీసుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. కాగా చాట్రాయి మండలంలో టీడీపీకి కార్యకర్తలు రాజీనామా చేశారు.

News January 13, 2025

కృష్ణా: భోగి మంట వేస్తున్నారా..?

image

సంక్రాంతి వేడుకల్లో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ నేడు భోగి మంట వేస్తున్నారా? మీ సెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ నంబర్ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

News January 12, 2025

కృష్ణా: భోగి మంట వేస్తున్నారా..?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీ సెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ నంబర్ 73311 61607కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.