News March 22, 2025
ALERT: సాతర్లలో గరిష్ఠంగా ఉష్ణోగ్రతలు నమోదు

గద్వాల జిల్లాలో 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. శుక్రవారం సాతర్లలో గరిష్ఠంగా 39.5, తోతినోనిదొడ్డి, ధరూర్, గద్వాల్, అలంపూర్లో 39.3 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరం అయితేనే మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News March 25, 2025
రంగారెడ్డి జిల్లా ఉష్ణోగ్రతలు ఇలా..

రంగారెడ్డి జిల్లాలో సోమవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. రెడ్డిపల్లె, చుక్కాపూర్లో 37.4℃ ఉష్ణోగ్రత నమోదైంది. తోమ్మిదిరేకుల, ప్రొద్దుటూరు 37.3, మొయినాబాద్, మంగళ్పల్లి 37.2, కాసులాబాద్ 36.9, మొగలిగిద్ద 36.8, కేతిరెడ్డిపల్లి 36.7, కేశంపేట 36.6, ధర్మసాగర్, తుర్కయంజాల్, షాబాద్ 36.4, హస్తినాపురం, నాగోల్ 36.2, పేద్దషాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్లో 36.1℃ ఉష్ణోగ్రత నమోదైంది.
News March 25, 2025
రంగారెడ్డి: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల పరిధిలో 2,158 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్కు 13 పరీక్ష కేంద్రాల పరిధిలో 2,965 మంది హాజరుకానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
News March 25, 2025
జీడీపీలో ఉమ్మడి పాలమూరు జిల్లా వెనుకబాటు

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వనరుల ఉత్పత్తులు వినియోగంలో ఉమ్మడి పాలమూరు జిల్లాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని ఆయా జిల్లాల క్యాపిటల్ ఇన్కమ్, జీడీపీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ రెండు అంశాల్లోనూ ఉమ్మడి జిల్లాగా ఉన్న పాలమూరు పరిస్థితి మాత్రం కొంత మెరుగ్గా ఉండగా, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల పరిస్థితి అధ్వానంగా ఉంది.