News January 2, 2025

ALERT హైదరాబాద్.. పెరుగుతున్న క్యాన్సర్ !

image

HYD నగరం సహ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. MNJ ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రి డాక్టర్ల ఆదేశాల మేరకు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాల్లో వచ్చి పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. RR, MDCL, VKB జిల్లాల్లోనూ ఇప్పటికే పలువురికి పరీక్షలు నిర్వహించారు. మరోవైపు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 24, 2025

డిసెంబర్ 10 నుంచి ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వీక్షించే అవకాశం!

image

ముచ్చర్ల సమీపంలోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ తలుపులు త్వరలో ప్రజల కోసం తెరవనున్నాయి. DEC 8, 9న జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 అనంతరం 10, 11, 12న సాధారణ ప్రజలు సందర్శించేందుకు అనుమతి ఉంటుంది. తెలంగాణలో ప్రపంచ పెట్టుబడులు చూపడం, రాష్ట్ర విధానాలు, భవిష్యత్తు ప్రాజెక్టులను ప్రదర్శించడం ఈ సదస్సు లక్ష్యం. భారీ భద్రత, నిఘా మధ్య ప్రజలకు ఇబ్బంది లేని ఎంట్రీ, ఎగ్జిట్‌పై అధికారులు చర్చిస్తున్నారు.

News November 24, 2025

అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇంటికి CP సజ్జనార్

image

హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్ అర్ధరాత్రి పెట్రోలింగ్ వాహ‌నంలో స్వయంగా గస్తీ నిర్వహించారు. లంగ‌ర్‌హౌజ్ పీఎస్ ప‌రిధిలోని ఎండీ లైన్స్, ఆశాంనగర్, డిఫెన్స్‌కాలనీల్లోని రౌడీషీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లారు. ఇంట్లోనే ఉన్న రౌడీషీటర్లను నిద్రలేపి వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, వ్యవహార ధోరణులపై ఆరా తీశారు. మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని CP సజ్జనార్ హెచ్చరించారు.

News November 24, 2025

HYD: కారు ప్రమాదంలో సజీవదహనమైన దుర్గాప్రసాద్

image

శామీర్‌పేట్ ORRపై జరిగిన ప్రమాదంలో కారులో సజీవదహనమైన వ్యక్తి దుర్గాప్రసాద్ (34)గా పోలీసులు గుర్తించారు. హనుమకొండ ప్రాంత వాసి అని తెలిపారు. నగరంలో వ్యాపారం నిమిత్తం వచ్చి ఇంటికి వెళ్లేందుకు దుండిగల్‌లోని ORR వైపు మళ్లించాడని, శామీర్‌పేట్ ఎగ్జిట్ దాటిన తర్వాత ఉదయం 5:50 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కారులో హీటర్ ఆన్ చేసి నిద్రించాడేమోనని? అనుమానిస్తున్నారు.