News February 27, 2026
ALERT: ఎల్లుండి నుంచి కొత్త రూల్

ఇండియాలో మెసేజింగ్ యాప్లకు ‘సిమ్ బైండింగ్’ నిబంధన మార్చి 1 నుంచి అమలుకానుంది. దీనివల్ల మీ ఫోన్లో ఫిజికల్గా సిమ్ ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్స్ పనిచేస్తాయి. ఈ గడువును పెంచేందుకు కేంద్రం నిరాకరించింది. అంతేకాకుండా ఇకపై కంప్యూటర్ లేదా వెబ్లో లాగిన్ అయిన వారు ప్రతి 6 గంటలకు ఒకసారి మళ్లీ అథెంటికేషన్ చేయాలి. లేదంటే ఆటోమేటిక్గా లాగ్ అవుట్ అవుతుంది.
Similar News
News February 27, 2026
తడబడిన న్యూజిలాండ్.. స్కోర్ ఎంతంటే?

T20WC: ENGతో జరుగుతున్న మ్యాచులో న్యూజిలాండ్ తడబడింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 రన్స్ చేసింది. సీఫర్ట్ 35, అలెన్ 29, ఫిలిప్స్ 39 రన్స్ చేశారు. మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. రషీద్, జాక్స్, రెహన్ అహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచులో ENG గెలిస్తే పాకిస్థాన్ సెమీస్ వెళ్లడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ NZ గెలిస్తే పాక్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది.
News February 27, 2026
DINK జంటలకూ డబ్బు సరిపోవట్లేదు!

పిల్లల బాధ్యత, ఖర్చుల నుంచి తప్పించుకునేందుకు చాలా జంటలు డ్యుయల్ ఇన్కమ్, నో కిడ్స్ (DINK) పాలసీని ఫాలో అవుతున్నాయి. కానీ వీరిలో చాలా మందికి సంపాదన సరిపోవడం లేదు. పొదుపుపై దృష్టి పెట్టకుండా ఆదాయాన్ని ఖర్చులు, జల్సాలకు వాడుకోవడం.. ఒకరి ఖర్చులు మరొకరు పట్టించుకోకపోవడం, ఆదాయానికి తగినట్టు ఖర్చులు పంచుకోకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. ఆదాయంతో సంపద పెరుగుతుంది అనుకోవడం పొరపాటని నిపుణులు చెబుతున్నారు.
News February 27, 2026
మార్చి 28న ఐపీఎల్ ప్రారంభం?

ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 28న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబరులో BCCI ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీని మార్చి 26గా ప్రకటించింది. అయితే అస్సాం, బెంగాల్, తమిళనాడు ఎన్నికల తేదీలపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ప్రారంభ తేదీని 28కు మార్చినట్లు క్రిక్ఇన్ఫో వెల్లడించింది. ఫైనల్ మే 31న జరగనుందని తెలిపింది. కాగా వచ్చే వారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.


