News December 22, 2025

ALERT: పిల్లల ఆధార్‌ను అప్డేట్ చేశారా?

image

పిల్లల ఆధార్ కార్డుల్లో బయోమెట్రిక్ అప్డేట్ చేయడం తప్పనిసరి అని UIDAI పేర్కొంది. 5- 15 ఏళ్లు నిండిన పిల్లలకు స్కూల్ అడ్మిషన్లు, ఎగ్జామ్స్, ప్రభుత్వ పథకాల్లో ఇబ్బందులు రావొద్దంటే ఫింగర్‌ప్రింట్స్, ఫొటో అప్డేట్ చేయాలని సూచించింది. తల్లిదండ్రులు సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని X ద్వారా వెల్లడించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వరకూ ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు.

Similar News

News December 25, 2025

మహిళలపై కంట్రోల్ కోసమే ఇదంతా: అనసూయ

image

పాత తరాలు అలవాటుపడ్డ ఆలోచనలను మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని నటి <<18662962>>అనసూయ<<>> పేర్కొన్నారు. ‘కొంతమంది వయసు ఆధారంగా నన్ను తక్కువ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఆలోచనున్న వాళ్లు ప్రగతిశీల మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు. ఇది మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం, బలహీనమైన పితృస్వామ్య అహంకారాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో జరుగుతుంది’ అని ట్వీట్ చేశారు.

News December 25, 2025

రంగ రాయ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

AP: కాకినాడలోని రంగ రాయ మెడికల్ కాలేజీలో 34 పారా మెడికల్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి ఇంటర్, DCLT, BSc న్యూరో ఫిజియాలజీ, న్యూరో టెక్నాలజీ, BSc డయాలసిస్ టెక్నీషియన్, రేడియోథెరపీ టెక్నీషియన్, BSc ఇమేజింగ్ టెక్నాలజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డ్రైవర్ పోస్టులకు టెన్త్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. https://rmckakinada.com/

News December 25, 2025

బంగ్లాకు తారిఖ్ రీఎంట్రీ: భారత్‌కు కలిసొచ్చేనా?

image

17 ఏళ్ల తర్వాత బంగ్లా డార్క్ ప్రిన్స్ తారిఖ్ రెహమాన్ స్వదేశానికి రానుండడాన్ని పెను మార్పుగా దౌత్యవేత్తలు అభివర్ణిస్తున్నారు. భారత్‌కు సానుకూల అంశంగా విశ్లేషిస్తున్నారు. బంగ్లాలో రెచ్చిపోతున్న మత ఛాందసవాదులు, జమాత్ ఏ ఇస్లామీ లాంటి యాంటీ ఇండియా, పాకిస్థాన్ అనుకూల శక్తులకు చెక్ పెట్టడానికి తారిఖ్ నాయకత్వంలోని BNP కీలకం కానుంది. అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడితే భారత్‌తో సంబంధాలు మెరుగుపడతాయి.