News March 26, 2025
ALERT.. బాపట్లలో 28న జరిగే కార్యక్రమం రద్దు

ఎస్టీలు, దివ్యాంగుల కొరకు శుక్రవారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఈనెల 28వ తేదీన తాత్కాలికంగా రద్దు చేసినట్లు బాపట్ల కలెక్టర్ జె.వెంకట మురళి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనివార్య కారణాలు, పరిపాలన సౌలభ్యంలో భాగంగా మార్చి నెలలో జరగవలసిన ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ మాత్రమే రద్దు చేశామన్నారు. ఫిర్యాదుదారులు ఎవరూ శుక్రవారం కలెక్టరేట్కి రావద్దని సూచించారు.
Similar News
News September 17, 2025
OG టికెట్ ధరలు భారీగా పెంపు

పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. ఈ నెల 25న అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోకు అనుమతిస్తూ టికెట్ ధరను రూ.1000గా పేర్కొంది. అంతేకాకుండా అక్టోబర్ నాలుగు వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో గరిష్ఠంగా రూ.125, మల్టీప్లెక్స్లలో రూ.150 వరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని తెలిపింది. మరోవైపు తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
News September 17, 2025
ఆరోగ్యశ్రీకి రూ. 44 కోట్లు ఖర్చు: కోదండ రెడ్డి

కామారెడ్డిలో ఆరోగ్యశ్రీ పథకం కింద 17 వేల మందికి పైగా నిరుపేదలకు వైద్య సేవలు అందించినట్లు రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి వెల్లడించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది కాలంలో శస్త్రచికిత్సలు, ఇతర వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం రూ. 44 కోట్లు వెచ్చించిందని తెలిపారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారికి నాణ్యమైన వైద్యం అందుతోందని పేర్కొన్నారు.
News September 17, 2025
నర్సంపేట: నేషనల్ స్పేస్ సొసైటీలో నిహారిక ఫస్ట్..!

నర్సంపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న భూక్య నిహారిక నేషనల్ స్పేస్ సొసైటీ (USA) నిర్వహించిన “Road Map to Space Art Contest” డ్రాయింగ్ విభాగంలో ప్రపంచ స్థాయి మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా నర్సంపేట MLA దొంతి మాధవ రెడ్డి భూక్య నిహారికను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.