News March 21, 2025
ALERT: మన్యం జిల్లాకు వర్ష సూచన

భగ్గమంటున్న ఎండలు, ఉక్కబోతతో అల్లాడిన మన్యం జిల్లా వాసులకు APSDMA చల్లటి కబురు చెప్పింది. జిల్లాలో శనివారం వడగాలులు, ఆదివారం వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని AP డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది.
Similar News
News March 28, 2025
బాలికల గురుకులాల్లో పురుష సిబ్బంది ఉండొద్దు: ఎస్సీ సొసైటీ

TG: SC బాలికల గురుకులాలు, కాలేజీల్లోని అన్ని పోస్టుల్లో మహిళా సిబ్బందే ఉండాలని SC గురుకుల సొసైటీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో జారీ చేసిన జీవో 1274 ఉత్తర్వులను యథావిధిగా అమలు చేయాలని తెలిపింది. బాలికల విద్యాలయాల్లో ఎవరైనా పురుష సిబ్బంది కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బాలుర స్కూళ్లు, కాలేజీలను జనరల్గా పరిగణించి వాటిలోని పోస్టులను మహిళలు, పురుషులతో భర్తీ చేస్తామని పేర్కొంది.
News March 28, 2025
ఈ 3 రంగాలకు AIతో ముప్పు లేదు: బిల్ గేట్స్

AI వల్ల పలు రంగాల్లో ఉద్యోగాలు పోతాయన్న అంచనాల నేపథ్యంలో బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కోడింగ్, బయాలజీ, ఎనర్జీ రంగాల ఉద్యోగాలను AI రీప్లేస్ చేయలేదు. AI కోడింగ్ చేసినా ప్రోగ్రామర్ల అవసరం ఉంటుంది. బయాలజిస్ట్లను కూడా అది భర్తీ చేయలేదు. కానీ వ్యాధి నిర్ధారణ, DNA విశ్లేషణ వంటి వాటిలో ఉపయోగపడుతుంది’ అని అన్నారు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని AI ఇంకా సొంతం చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు.
News March 28, 2025
ఇండియన్ ఆర్మీకి సిద్దిపేట యువకుడు ఎంపిక

సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం మగ్ధుంపూర్ గ్రామానికి చెందిన వరిగంటి రాహుల్(20) ఇండియన్ ఆర్మీ జీడీ జవాన్గా ఎంపికయ్యాడు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న రాహుల్ ఆర్మీ కావాలన్న లక్ష్యంతో ఈవెంట్స్, పరీక్షలకు సిద్ధమై తన కలను సాకారం చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఐలయ్య, చైతన్య వ్యవసాయం చేస్తున్నారు. సైనికుడిగా దేశానికి సేవలు అందించనున్నరాహుల్ను కుటుంబ సభ్యులు, మిత్రులు, గ్రామస్థులు అభినందించారు.