News April 12, 2024

ALERT: రెండు రోజులు వడగాలులు.. జాగ్రత్త

image

ఉమ్మడి తూ.గో.జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. 13, 14వ తేదీల్లో పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. 13న తూ.గో. జిల్లాలోని 6, కాకినాడ జిల్లాలో 5 మండలాల్లో వడగాలులు ఉంటాయని తెలిపింది. 14న తూ.గో జిల్లాలో 18 మండలాలు, కాకినాడ జిల్లాలో 11 మండలాలు, కోనసీమలో 9 మండలాల్లో ఈ ప్రభావం ఉండనున్నట్లు తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Similar News

News October 6, 2025

రాజమండ్రి: బస్సులు, రైళ్లు కిటకిట

image

దసరా సెలవులు ముగియడంతో బస్సులు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రాజమండ్రి ఆర్టీసీ డిపో నుంచి రెగ్యులర్ సర్వీసులతో పాటు 175 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డీపీటీవో వైవీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలకు రద్దీని బట్టి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైల్వే స్టేషన్‌లోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.

News October 6, 2025

రాజమండ్రి: ధర లేక కోకో రైతుల దిగాలు

image

తూర్పు గోదావరి జిల్లాలో కోకోకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 2023లో కిలో రూ. 1,030 పలికిన ధర ఈ ఏడాది రూ. 450కి పడిపోయింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర తగ్గించడంతో రైతుల ఆందోళనల తర్వాత కలెక్టర్ సంప్రదింపులు చేసి రూ. 50 పెంచారు. ప్రస్తుతం ఆ పెంచిన ధరతో కూడా కొనే నాథులు లేక రైతులు అల్లాడుతున్నారు.

News October 6, 2025

యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్ కీర్తి

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం ఈనెల 6న జిల్లాలో యథాతధంగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. ప్రజలు తమ అర్జీలను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలియజేయాలని కోరారు. పాత అర్జీల పరిష్కార స్థాయి తెలుసుకోవడానికి 1100కు ఫోన్ నంబర్‌కి చేయాలన్నారు.