News January 18, 2025
భూమి వైపు దూసుకొస్తోన్న గ్రహశకలం

భారీ స్టేడియం పరిమాణంతో 820 అడుగుల గ్రహశకలం భూమివైపు దూసుకొస్తోందని నాసా హెచ్చరించింది. ఇది రేపు భూమికి చేరువగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. 2024 WY70 అని పిలువబడే ఒక భారీ గ్రహశకలం 36,606 KMPH వేగంతో దూసుకొస్తోంది. ఒకవేళ ఇది భూమిని ఢీకొన్నట్లయితే భారీ ఎత్తున వినాశనం జరుగుతుందని, దీని ప్రభావం వందలాది అణు బాంబులతో సమానమని NASA తెలిపింది.
Similar News
News November 28, 2025
VKB: టీఈ పోల్ యాప్ను వినియోగించుకోండి: కలెక్టర్

టీఈ పోల్ మొబైల్ యాప్ ద్వారా కావాలసిన సమాచారాన్ని పొందవచ్చునని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు వివరాలను మొబైల్ యాప్ ద్వారా ఓటర్ స్లిప్ ను పొందవచ్చునని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వివరాలను కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చునని, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదును కూడా యాప్ ద్వారా తెలియచేయవచ్చునని తెలిపారు.
News November 28, 2025
మేడారంలో వనదేవతల దర్శనానికి 8 క్యూలైన్లు: ములుగు ఎస్పీ

మేడారం వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అదనంగా మరో ఐదు క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నామని ములుగు ఎస్పీ సుధీర్ కేకన్ తెలిపారు. మొత్తం ఎనిమిది క్యూలైన్ల ద్వారా భక్తులను గద్దెల వద్దకు అనుమతిస్తామన్నారు. 3 గేట్ల ద్వారా బయటకు పంపిస్తామని తెలిపారు. ఈసారి మహా జాతరకు 1.50 కోట్ల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నామన్నారు. తల్లుల దర్శనానికి అందరికీ ఒకటే నిబంధన అమలు చేస్తామన్నారు.
News November 28, 2025
తూర్పు గోదావరి జిల్లాలో బడి బస్సులపై ప్రత్యేక డ్రైవ్

విద్యాసంస్థలకు చెందిన బస్సుల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసేందుకు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 వరకు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు డీటీఓ ఆర్. సురేశ్ తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ డ్రైవ్కు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో 2,000కు పైగా బస్సులను నాలుగు ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తాయని డీటీఓ వివరించారు.


