News July 31, 2024
ALERT: మరణాల్లో కరెంట్ ‘షాక్’

దేశంలో కరెంట్ షాక్ వల్ల నమోదవుతున్న మరణాలపై NCRB(నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) షాకింగ్ వివరాలు వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం 2015-2020 మధ్య ఏకంగా 72,000 మంది కరెంట్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయారు. అంటే ఏడాదికి సగటున 12,000 మంది, డైలీ 32 మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నమాట. ఇటీవల UPలో ఓ UPSC అభ్యర్థి హాస్టల్ వద్ద వర్షపు నీటిలో కరెంట్షాక్కు గురై మరణించిన ఘటన అందర్నీ కలచివేసింది.
Similar News
News April 1, 2026
నిజంగా ఇరాన్ను ఎవరు పాలిస్తున్నారు?

యుద్ధం ముదురుతున్న కొద్దీ ఇరాన్లో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమవుతున్నాయి. ఇరాన్ ఇంటర్నేషనల్ కథనం ప్రకారం.. అధ్యక్షుడు పెజెష్కియాన్ అధికారాలను పక్కనబెట్టి IRGC మొత్తం పాలనను తన చేతుల్లోకి తీసుకుంది. సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని సైన్యం ఐసోలేట్ చేయడంతో ప్రభుత్వానికి ఆయనకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలపై దాడుల విషయంలో IRGCకి అధ్యక్షుడితో విభేదాలే ఈ పరిణామాలకు కారణమని తెలుస్తోంది.
News April 1, 2026
AIతో జాబ్ పోయిందని భర్త ఆత్మహత్య.. 18వ ఫ్లోర్ నుంచి దూకేసిన భార్య

బెంగళూరులో భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. సిద్దిపేట జిల్లాకు చెందిన భానుచందర్ రెడ్డి AI కారణంగా గతేడాది ఉద్యోగం కోల్పోవడంతో అమెరికా నుంచి వచ్చేశారు. భార్య షాజియాతో కలిసి బెంగళూరులో నివసిస్తున్నారు. జాబ్ పోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆయన సోమవారం ఉరేసుకున్నాడు. అది తట్టుకోలేని భార్య 20 నిమిషాల్లోనే 18వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
News April 1, 2026
యంగ్ హీరోలతో బాలయ్య పోటీ.. మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్!

బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో మూవీ చేస్తుండగా, ఆ తర్వాత వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దసరాకు షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే విజయ్ కనకమేడల చెప్పిన కథకూ బాలయ్య ఓకే చెప్పినట్లు సమాచారం. ఇది 2027 ఆరంభంలో పట్టాలెక్కనుందని టాక్. నాంది, భైరవం, ఉగ్రం చిత్రాలకు విజయ్ డైరెక్షన్ చేశారు.


