News July 4, 2024
ALERT: EAMCET(ఇంజనీరింగ్) మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్

TS EAMCET -2024( ఇంజనీరింగ్) మొదటి విడత కౌన్సెలింగ్ నేటి(JULY4) నుండి ప్రారంభం కాగా… JULY 12 వరకు ఆన్లైన్ లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశం కలదు.
✓JULY6 నుండి 13 వరకు స్లాట్ బుక్ చేసుకున్న వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్
✓JULY 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ ఎంపిక
✓JULY 19 మొదటి విడత సీట్ల కేటాయింపు
వెబ్సైట్: https://tgeapcet.nic.in
#SHARE IT
Similar News
News February 16, 2026
హోరాహోరీ పోరులో పాలమూరు విజయం

జడ్చర్లలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-17 టోర్నీ ఫైనల్లో మహబూబ్ నగర్ జట్టు 15 ఓవర్లలో 110/5 పరుగులు చేసింది. రామ్ చారి 31, కేతాన్ 30 పరుగులు చేశారు. నాయక్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం ఖమ్మం జట్టు 107/5 పరుగులు చేసింది. 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మాన్విత్ 30, సులేమాన్ 29 పరుగులు చేశారు. ముఖ్య అతిథిగా ఏఎంఓ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ జ్యోతి హాజరయ్యారు.
News February 16, 2026
MBNR: U-17 క్రికెట్ టోర్నీ విజేతగా మహబూబ్నగర్

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మినీ స్టేడియంలో 69వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్-17 క్రికెట్ బాలుర టోర్నమెంట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల నుంచి పది జట్లు పాల్గొనగా.. మొదటి స్థానంలో మహబూబ్నగర్, రెండో స్థానంలో ఖమ్మం, రంగారెడ్డి జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. గెలిచిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఎంఈఓ మంజులాదేవి, SGF సెక్రటరీ ఆర్.శారదాబాయి, స్థానిక నేతలు, పీడీలు పాల్గొన్నారు.
News February 16, 2026
MBNR: ఎవరూ అరెస్టు కాలేదు: ఎమ్మెల్యే

ఎవరూ అరెస్టు కాలేదని, సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను ప్రజలు నమ్మవద్దని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అత్యుత్సాహంతో అసత్య ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ తనతోనే బస్సులో ఉన్నారని, ఎటువంటి అరెస్టు జరగలేదని ఆయన స్పష్టతనిచ్చారు.


