News December 22, 2024

టెన్త్ విద్యార్థులకు ALERT.. మోడల్ పేపర్లు విడుదల

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. విద్యార్థులతో ఈ పేపర్లను ప్రాక్టీస్ చేయించాలని స్కూళ్లకు సూచించింది. <>ఆన్‌లైన్‌లో<<>> ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈసారి క్వశ్చన్ బ్యాంక్ కొత్త వెర్షన్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.

Similar News

News October 29, 2025

జీవిత సత్యం.. తెలుసుకో మిత్రమా!

image

జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి ఆసుపత్రి, జైలు, శ్మశానాన్ని సందర్శించాలని స్పిరిచ్యువల్, లైఫ్ కోచెస్ సూచిస్తున్నారు. ఆసుపత్రిలో ఆరోగ్యం విలువ, జైలులో ఒక తప్పుడు నిర్ణయం జీవితాన్ని ఎలా మారుస్తాయో తెలుస్తుంది. శ్మశానంలో ధనిక, పేద తేడా లేకుండా అందరూ ఒకే నేలలో కలిసిపోతారు. చివరికి మనం మిగిల్చిపోయే జ్ఞాపకాలు, మనతో తీసుకెళ్లే పశ్చాత్తాపాలే ముఖ్యమని ఈ మూడు వివరిస్తాయని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్.

News October 29, 2025

డేటా లీక్.. వెంటనే పాస్‌వర్డ్స్ మార్చుకోండి!

image

భారీ డేటా ఉల్లంఘనలో 183 మిలియన్లకు పైగా ఈమెయిల్ పాస్‌వర్డ్‌లు లీక్ అయినట్లు AUS సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు ట్రాయ్ హంట్ ధ్రువీకరించారు. వీటిలో Gmail ఖాతాల వివరాలు కూడా ఉన్నాయి. మాల్‌వేర్ ద్వారా దొంగిలించిన లాగిన్ ఐడీలతో మొత్తం 3.5 టెరాబైట్ల (875 HD సినిమాలకు సమానం) డేటాను హ్యాకర్స్ రూపొందించారు. మీ ఖాతా వివరాలు లీక్ అయ్యాయో లేదో తనిఖీ చేసుకుని, వెంటనే పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని ట్రాయ్ సూచించారు.

News October 29, 2025

అరటి పరిమాణం పెంచే ‘బంచ్‌ ఫీడింగ్‌’ మిశ్రమం

image

అరటి కాయల పరిమాణం పెరుగుదలకు భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ బంచ్ ఫీడింగ్ మిశ్రమం రూపొందించింది. 100ml నీటిలో 7.5 గ్రా. నత్రజని ఎరువు, 7.5 గ్రాముల పొటాష్‌ ఎరువు కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని 500 గ్రాముల పేడలో బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని పైన ఫొటోలో చూపినట్లు కాయలు కాసిన తర్వాత క్రింది పువ్వును కత్తిరించి, ఆ మిశ్రమం ఉన్న పాలిథిన్‌ సంచిలో కాయలు కాసిన కాడకు ఒక అడుగు దూరం వదిలి గట్టిగా కట్టాలి.