News March 16, 2025
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్

AP: ఇటీవల శ్రీశైల మల్లన్న భక్తులు పలువురు నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవడంతో ఆలయం ఈవో శ్రీనివాసరావు పలు సూచనలు చేశారు. వసతి, దర్శనం, ఆర్జిత సేవల టికెట్లను అధికారిక వెబ్సైట్లోనే బుక్ చేసుకోవాలన్నారు. www.srisailamdevasthanam.org, www.aptemples.ap.gov.in దేవస్థానం, దేవాదాయ శాఖ వెబ్సైట్లను మాత్రమే వినియోగించాలన్నారు. దేవస్థానం వివరాలకు 83339 01351, 52, 53 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Similar News
News October 25, 2025
వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా ఓటర్ లిస్ట్ సవరణ!

దేశవ్యాప్తంగా ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను వచ్చే వారం నుంచి EC చేపట్టనుంది. తొలి దశలో 10-15 రాష్ట్రాల్లో ప్రారంభించనుందని తెలుస్తోంది. 2026లో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ముందుగా SIR చేపట్టనున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికలు జరుగుతున్న, త్వరలో జరిగే రాష్ట్రాలను ఈ ప్రక్రియ నుంచి మినహాయించనుంది. కాగా తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో 2026లో ఎన్నికలు జరగనున్నాయి.
News October 25, 2025
కర్నూలు బస్సు ప్రమాదం.. సోనూసూద్ రిక్వెస్ట్

కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో నటుడు సోనూసూద్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఓ విజ్ఞప్తి చేశారు. ‘ప్రతి లగ్జరీ బస్సులో ఎమర్జెన్సీ డోర్ ఎలక్ట్రానిక్ కాకుండా మాన్యువల్ది పెట్టాలి. ఆపరేటర్లకు నెల సమయం ఇవ్వండి. పర్మిట్ రెన్యూవల్ సమయంలో ఆపరేటర్లు డోర్ మార్చినట్లు ఫొటోలు అప్లోడ్ చేయాలని చెప్పండి. నితిన్ గడ్కరీ సార్ చర్యలు తీసుకోండి. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడకండి’ అని ట్వీట్ చేశారు.
News October 25, 2025
డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉద్యోగాలు

<


