News December 16, 2024

శ్రీవారి భక్తులకు అలర్ట్

image

AP: నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవడంతో తిరుమలలో రేపటి నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను రద్దు చేశారు. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పాశురాలతో శ్రీవారికి మేలుకొలుపు చేయనున్నట్లు పేర్కొన్నారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చాన, శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను స్వామివారికి అలంకరించనున్నారు. నైవేద్యంగా బెల్లం దోశ, సిరా, పొంగల్ నివేదించనున్నారు.

Similar News

News November 27, 2025

బాలానగర్‌లో 13.5°C.. పెరిగిన చలి తీవ్రత

image

మహబూబ్‌నగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో జిల్లాలోనే అత్యల్పంగా బాలానగర్‌లో 13.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్‌లో 13.8°C, దోనూరులో 13.9°C నమోదయ్యింది. తీవ్రమైన చలి కారణంగా వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.

News November 27, 2025

స్మృతి మంధానకు మద్దతుగా నిలిచిన జెమీమా

image

తండ్రి అనారోగ్యంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న స్మృతి మంధాన కోసం తోటి క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్మృతి ఫ్యామిలీకి మద్దతుగా నిలిచేందుకు బిగ్ బాష్ లీగ్ మిగతా మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఆమె ప్రాతినిధ్యం వహించే బ్రిస్బేన్ హీట్ ఈ విషయం వెల్లడించింది. స్మృతి పెళ్లి కోసం జెమీమా ఇండియాకు వచ్చారని, పెళ్లి ఆగిపోవడంతో ఫ్రెండ్‌కు సపోర్ట్ కోసం ఇక్కడే ఉంటానని తెలిపారని పేర్కొంది.

News November 27, 2025

NIT వరంగల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

image

<>NIT <<>>వరంగల్‌ 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి ఎంఏ (ఫ్రెంచ్, జర్మన్), పీహెచ్‌డీ ఉత్తీర్ణులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.70వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nitw.ac.in/