News February 4, 2025
శ్రీవారి భక్తులకు అలర్ట్

AP: రేపు రథసప్తమి కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను సర్వదర్శనంలో అనుమతిస్తామని TTD EO శ్యామలరావు తెలిపారు. ఉ.5.30కు సూర్యప్రభ వాహన సేవతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఉ.9-10 వరకు చిన్న శేష వాహన సేవ, ఉ.11-12 వరకు గరుడ వాహన సేవ, మ.1-2 వరకు హనుమంత వాహన సేవ, మ.2-3 వరకు చక్రస్నానం, సా.4-5 వరకు కల్పవృక్ష వాహన సేవ, సా.6-7 వరకు సర్వభూపాల వాహన సేవ, రా.8-9 వరకు చంద్రప్రభ వాహన సేవతో వేడుకలు ముగుస్తాయి.
Similar News
News December 16, 2025
కేసీఆర్ మీటింగ్ వాయిదా

TG: ఈ నెల 19న KCR అధ్యక్షతన జరగాల్సిన BRSLP సమావేశం వాయిదా పడింది. ఈ మీటింగ్ను 21వ తేదీన నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. 19న పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో BRS MPలు కూడా ఈ భేటీలో పాల్గొనాలనే ఉద్దేశంతో వాయిదా వేశామని తెలిపారు. ఈ మీటింగ్లో కృష్ణా-గోదావరి నదులపై BRS సర్కార్ పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై చర్చిస్తారని సమాచారం.
News December 16, 2025
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్కు ఊరట

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ <<16467368>>కేసు<<>>లో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఊరటనిచ్చింది. ED దాఖలు చేసిన PMLA ఫిర్యాదును స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ విచారణను కొనసాగించవచ్చని కోర్టు పేర్కొంది. ఏజేఎల్ (Associated Journals Limited) ఆస్తుల బదిలీపై ఈడీ ఆరోపణలు చేస్తోంది.
News December 16, 2025
సర్పంచ్ అభ్యర్థి మృతి.. డబ్బును తిరిగిచ్చేసిన ఓటర్లు!

TG: సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి గుండెపోటుతో మృతిచెందడంతో అతని వద్ద ఓటు కోసం తీసుకున్న డబ్బులను గ్రామస్థులు తిరిగిచ్చారు. ఈ ఘటన నల్గొండ(D) మునుగోడు(M) కిష్టాపురంలో జరిగింది. చెనగోని కాటంరాజు BRS మద్దతుతో పోటీ చేయగా 143 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓటమితో మనస్తాపానికి గురైన ఆయన గుండెపోటుకు గురై చనిపోయారు. ఓట్ల కోసం ఆయన పంచిన డబ్బును పలువురు గ్రామస్థులు జమ చేసి తిరిగి ఇచ్చేశారు.


