News September 28, 2024

డిగ్రీ పూర్తైన వారికి ALERT

image

AP: ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ MLA ఎన్నికలకు SEP 30 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారం-18లో పాస్‌పోర్ట్ ఫొటో, గెజిటెడ్ ఆఫీసర్‌తో ధృవీకరించిన డిగ్రీ సర్టిఫికెట్ జిరాక్స్, ఎపిక్ కార్డు, ఆధార్ కార్డు జతపరచాలి. 2021 జూన్‌లోపు డిగ్రీ పూర్తైనవారు దరఖాస్తుకు అర్హులు. 10+2+3 విధానంలో పాసైన వారు మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోవాలి. టెన్త్ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివిన వారు అనర్హులు.

Similar News

News November 26, 2025

నా భవిష్యత్తుపై బీసీసీఐదే నిర్ణయం: గంభీర్

image

సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం IND హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్తుపై BCCI నిర్ణయం తీసుకుంటుందన్నారు. ‘నేను పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా లేదా అనేది బోర్డు డిసైడ్ చేస్తుంది. భారత క్రికెట్ మాత్రమే ముఖ్యం. నేను కాదు’ అని పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచినప్పుడూ తానే కోచ్‌గా ఉన్నానని గుర్తు చేశారు. తాజా ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు.

News November 26, 2025

HOCLలో 72 పోస్టులు.. అప్లై చేశారా?

image

కేరళలోని హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్ లిమిటెడ్(<>HOCL<<>>)లో 72 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంజినీరింగ్ డిగ్రీ, BSc, డిప్లొమా, ITI అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. షార్ట్‌లిస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రాతపరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://www.hoclindia.com/

News November 26, 2025

SBI సరికొత్త రికార్డు.. షేర్ వాల్యూ@రూ.999

image

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI సరికొత్త రికార్డు నమోదుచేసింది. ఇవాళ సంస్థ స్టాక్ దాదాపు 3 శాతం పెరగడంతో విలువ ఆల్‌టైమ్ హై రూ.999కి చేరింది. స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.1000 కూడా దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా సంస్థ వ్యాపార విలువ రూ.100 లక్షల కోట్లకు చేరినట్లు ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.