News October 8, 2024

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

image

AP: ఇంటర్ మొదటి, రెండో ఏడాది చదివే విద్యార్థులు తప్పనిసరిగా 75 శాతం హాజరు కలిగి ఉండాలని బోర్డు కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. హాజరు శాతం 60-65గా ఉంటే రూ.2వేలు, 65-70గా ఉంటే రూ.1,500, 70-75గా ఉంటే రూ.వెయ్యి చెల్లించాలన్నారు. 60శాతం కంటే తక్కువ ఉన్న సైన్స్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అనర్హులని పేర్కొన్నారు. ఆర్ట్స్ విద్యార్థులను ప్రైవేట్‌గా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.

Similar News

News October 19, 2025

విషం తాగిన తల్లి.. కూతురు ఏం చేసిందంటే?

image

UP మీర్జాపూర్‌కు చెందిన ఐదేళ్ల బాలిక సమయస్ఫూర్తితో తల్లి ప్రాణాలు కాపాడుకుంది. నిన్న తన తల్లి విషం తాగడంతో శివాణి ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ 1090కు కాల్ చేసింది. వెంటనే సమీపంలోని పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. ఎమర్జెన్సీ సమయంలో హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయాలని స్కూల్లో చెప్పారని ఆ బాలిక చెప్పడంతో ప్రశంసలు కురుస్తున్నాయి.

News October 19, 2025

దీపావళి ఉత్సవాలు.. ఇవి గుర్తుంచుకోండి

image

*లైసెన్స్ పొందిన షాప్స్ నుంచే బాణసంచా కొనాలి.
*టపాకాయలు కాల్చేటప్పుడు కాటన్ వస్త్రాలు ధరించాలి. సింథటిక్ లేదా లూజ్ వస్త్రాలు ధరించవద్దు.
*పని చేయని పటాకులను మళ్లీ వెలిగించేందుకు ట్రై చేయవద్దు.
*క్రాకర్స్ వల్ల గాయమైతే ఐస్, వెన్న, ఆయింట్‌మెంట్ రాయవద్దు. 10-15 ని. పాటు శుభ్రమైన నీటితో చల్లగా ఉంచాలి.
*అత్యవసర సమయాల్లో 101 లేదా 112కి కాల్ చేయాలి.

News October 19, 2025

దీపావళికి తాబేలును ఎందుకు కొంటారు?

image

దీపావళి సందర్భంగా తాబేలును ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. తాబేలు అనేది విష్ణుమూర్తి కూర్మావతారానికి ప్రతీక. అందుకే అనేక ఆలయ కోనేట్లలో తాబేళ్లను వదులుతారు. దీపావళి రోజున దీన్ని ఇంటికి తేవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. దీర్ఘాయుష్షుకు సంకేతమైన ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఫలితంగా కుటుంబం సుఖ సంతోషాలతో వెలుగొందుతుందని భావిస్తారు.