News March 6, 2025
IPL ఫ్యాన్స్కు అలర్ట్.. రేపటి నుంచే టికెట్ బుకింగ్స్

‘IPL-2025’ టోర్నీ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈక్రమంలో హైదరాబాద్లో జరిగే తొలి రెండు మ్యాచులకు సంబంధించిన టికెట్లను రేపటి నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నట్లు SRH ప్రకటించింది. 23న SRHvsRR, 27న SRHvsLSG మ్యాచ్లు జరగనున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. రెండు టికెట్లకు ఒక జెర్సీ ఫ్రీగా ఇస్తారు.
Similar News
News October 14, 2025
WCలో RO-KO ఆడతారా.. గంభీర్ ఆన్సర్ ఇదే!

దిగ్గజ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడే విషయమై తాను గ్యారంటీ ఇవ్వలేనని టీమ్ఇండియా హెడ్ కోచ్ గంభీర్ చెప్పారు. అది వారి ఫిట్నెస్తో పాటు స్థిరమైన ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాబోయే ఆస్ట్రేలియా టూర్లో మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టెస్టులు, T20Iలకు వీడ్కోలు చెప్పిన రోహిత్, కోహ్లీ వన్డేల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
News October 14, 2025
ఇది భారత చరిత్రలో నిలిచిపోయే రోజు: అదానీ

గూగుల్తో కలిసి దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్ను విశాఖలో నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. ‘ఇది భారత చరిత్రలో నిలిచిపోయే రోజు. దేశంలోని అత్యంత కీలకమైన విద్య, వ్యవసాయం, ఫైనాన్స్ తదితర రంగాలకు AI ద్వారా పరిష్కారాలు చూపే ఎకోసిస్టమ్ను ఈ హబ్ క్రియేట్ చేస్తుంది. AI రెవల్యూషన్కు తోడ్పడే ఇంజిన్ను నిర్మించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.
News October 14, 2025
మట్టి దీపాలు కొంటే.. ‘పేదింట్లోనూ దీపావళి’

దీపావళి సమీపిస్తున్న సందర్భంగా ప్రజలందరూ ఖరీదైన, కృత్రిమ డెకరేషన్ లైట్లకు బదులుగా సంప్రదాయ మట్టి దీపాలు వెలిగించాలని నెటిజన్లు కోరుతున్నారు. మట్టి దీపాలు, ఇతర అలంకరణ వస్తువులను చిరు వ్యాపారులు లేదా స్థానిక తయారీదారుల వద్ద కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల వారిని ఆర్థికంగా ఆదుకున్నట్లు అవుతుందంటున్నారు. ఈ పండుగ వేళ వారికి వెలుగునిచ్చి, వారి జీవితాల్లో ఆనందాన్ని నింపవచ్చని చెబుతున్నారు.