News March 26, 2025
ALERT: నేడు 108 మండలాల్లో వడగాలులు

AP: రాష్ట్రంలో ఇవాళ 108 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం (15), విజయనగరం (21), మన్యం (10), అల్లూరి (8), అనకాపల్లి (7), కాకినాడ (7), కోనసీమ (3), తూర్పుగోదావరి (13), ఏలూరు (5), కృష్ణా (2), ఎన్టీఆర్ (6), గుంటూరు (3), పల్నాడు జిల్లాలోని 8 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. అలాగే ఇవాళ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని పేర్కొంది.
Similar News
News March 29, 2025
కొత్త సినిమా రికార్డు.. రెండ్రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు!

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన ‘L2 ఎంపురాన్’ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఈనెల 27న ఈ చిత్రం విడుదలవగా రెండ్రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి చరిత్ర సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని, వీకెండ్ పూర్తయ్యేలోపు మరిన్ని కలెక్షన్లు వస్తాయని సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రాన్ని పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించారు.
News March 29, 2025
ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫీచర్లు

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ ‘ఇన్స్టాగ్రామ్’లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. రీల్స్ చూసేటప్పుడు వీడియోను ఫార్వర్డ్ చేయాలంటే కష్టంగా ఉండేది. కొత్త ఫీచర్ ద్వారా వీడియోకు కుడి/ ఎడమ వైపు లాంగ్ ప్రెస్ చేస్తే వీడియో 2x స్పీడ్లో ఫార్వర్డ్ అవుతుంది. మధ్యలో ప్రెస్ చేస్తే వీడియో పాజ్ అవుతుంది. దీంతోపాటు వాట్సాప్లా ఇన్స్టాలోనూ మెసెంజర్లో మన లొకేషన్ పంపొచ్చు.
News March 29, 2025
ఆ టికెట్లను ఆన్లైన్లోనూ క్యాన్సిల్ చేసుకోవచ్చు: అశ్వినీ వైష్ణవ్

రైలు టికెట్ల రద్దుకు సంబంధించి ఇండియన్ రైల్వే కొత్త క్యాన్సిలేషన్ విధానాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే టికెట్ కౌంటర్లలో కొనుగోలు చేసిన టికెట్లనూ ఇకపై IRCTC వెబ్సైట్లో లేదా 139కి కాల్ చేయడం ద్వారా క్యాన్సిల్ చేసుకోవచ్చన్నారు. దీంతో ప్రయాణికుల సమయం ఆదా అవడంతో పాటు శ్రమ తగ్గుతుందని చెప్పారు. అయితే టికెట్ రీఫండ్ కోసం ఆయా కౌంటర్ల వద్దకే వెళ్లాలని సూచించారు.