News November 25, 2024

ALERT.. ఎల్లుండి నుంచి భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి నేడు వాయుగుండంగా మారనుంది. మరో 2 రోజుల్లో వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఎల్లుండి నుంచి కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రేపటి నుంచి సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.

Similar News

News December 10, 2025

కామారెడ్డి: ఓటరు ID లేకున్నా ఓటు వేయవచ్చు: కలెక్టర్

image

ఓటరు ID లేకున్నా అర్హులు ఓటు వేయవచ్చని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం సూచించిన ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వివిధ ప్రభుత్వ ఐడీ కార్డులు, హెల్త్ కార్డులు సహా మొత్తం 18 రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా చూపించి ఓటు వేయవచ్చని వెల్లడించారు. ఓటరు స్లిప్‌ను tsec.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

News December 10, 2025

గర్భంలోని బిడ్డకు HIV రాకూడదంటే..

image

హెచ్‌ఐవీ ఉన్న మహిళ గర్భం దాలిస్తే మాయ ద్వారా, రక్తం ద్వారా బిడ్డకి వైరస్‌ సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇలాకాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి. కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకి యోని ద్వారా వైరస్‌ సంక్రమించే అవకాశాలుంటాయి. కాబట్టి సీ సెక్షన్ చేయించడం మంచిది. పుట్టిన తర్వాత బిడ్డకు కూడా పరీక్ష చేయించి, ఆరు వారాల వరకు హెచ్‌ఐవీ మందులు వాడటం వల్ల వైరస్‌ బిడ్డకు సోకి ఉంటే నాశనమవుతుంది.

News December 10, 2025

ఇతిహాసాలు క్విజ్ – 92 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: గణపతి, కార్తీకేయ సోదరులను ముల్లోకాలు చుట్టిరమ్మనే పరీక్ష శివుడు ఎందుకు పెట్టాడు?
సమాధానం: ప్రమథగణాలకు నాయకత్వం వహించడానికి అర్హులెవరో నిర్ణయించడానికి శివుడు ఈ పరీక్ష పెట్టాడు. కార్తికేయుడు లోకాలు చుట్టడానికి వెళ్లగా, గణపతి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులే సకల లోకాలు అని నిరూపించాడు. అలా వినాయకుడు సకల కార్యాలలో తొలి పూజలు అందుకునే వరాన్ని అనుగ్రహించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>