News January 11, 2025
ALERT.. పెరగనున్న చలి తీవ్రత

TG: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం మరో 4 రోజులు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరగనున్నట్లు తెలిపింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు దిగువన నమోదవుతున్నాయని పేర్కొంది. కొమురం భీం(D) తిర్యాణీలో 6.8, ఆదిలాబాద్(D) భీంపూర్లో 7, నిర్మల్(D) పెంబీలో 9.1, సంగారెడ్డి(D) న్యాల్కల్లో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది.
Similar News
News February 6, 2026
నాలుగు సీజన్లు.. ఇద్దరే విజేతలు

WPLలో ముంబై, ఆర్సీబీ జట్లదే డామినేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన 4 సీజన్లలో ఈ రెండు జట్లే రెండేసి సార్లు విజేతలుగా నిలిచాయి. హర్మన్, స్మృతి సేనలు డామినేషన్తో ఇతర జట్లకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు. 2023, 2025లో ముంబై, 2024, 2026లో RCB విజేతలుగా నిలిచాయి. అటు ఢిల్లీ 4 సార్లు ఫైనల్ చేరిన టైటిల్ను గెలవలేకపోయింది. గుజరాత్ జెయింట్స్, యూపీకి ట్రోఫీ ఇంకా అందని ద్రాక్షగానే మిగిలింది.
News February 6, 2026
ఇంకా చూడాల్సింది.. జయించాల్సింది చాలా ఉంది మిత్రమా!

సాఫ్ట్వేర్ రంగంలో పెరుగుతున్న పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఏ సమస్యకైనా సూసైడ్ పరిష్కారం కాదని, పోరాడి సాధించాల్సింది ఎంతో ఉందని అంతా గుర్తుంచుకోవాలి. కొత్త స్కిల్స్ నేర్చుకోవడంపై ఫోకస్ చేయాలి. కంపెనీలు కూడా ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సైకాలజిస్టులను నియమించుకోవాలి. దీనిపై మీరేమంటారు?
News February 6, 2026
కశ్మీర్ మా దేశంలో భాగమవుతుంది: పాక్ ప్రధాని

కశ్మీర్ తమ దేశంలో అంతర్భాగమవుతుందని పాక్ PM షరీఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను గౌరవించడం, UNSC తీర్మానాలు అమలు చేయడమే J&K వివాదానికి సరైన పరిష్కారం. కశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నా’ అని కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా POK అసెంబ్లీలో అన్నారు. గతేడాది జరిగిన ఘర్షణల తర్వాత కశ్మీర్ వివాదం మళ్లీ రాజుకుందని చెప్పారు. ఇండియా ప్రాక్సీ టెర్రర్ను ఎగదోస్తోందని ఆరోపించారు.


