News April 16, 2025

ALERT.. నోటిఫికేషన్ విడుదల

image

AP: 2025-26 విద్యా సంవత్సరానికి అన్ని ప్రైవేట్ అన్‌ ఎయిడెడ్ స్కూళ్లలో పేద, బలహీన వర్గాల పిల్లలకు 1వ క్లాసులో 25% సీట్లు కేటాయించేందుకు ప్రభుత్వం <>నోటిఫికేషన్<<>> ఇచ్చింది. 5 సంవత్సరాలు నిండిన వారు ఈ నెల 28వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పిస్తే, ప్రభుత్వం సీట్లు కేటాయిస్తుంది. ఇందుకోసం తల్లిదండ్రుల ఆధార్/ఓటర్/రేషన్/జాబ్ కార్డు/ విద్యుత్ బిల్లు, DOB పత్రం ఉండాలి. ఇతర వివరాలకు 18004258599కు ఫోన్ చేయండి.

Similar News

News April 19, 2025

ఆ హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చు: కూనంనేని

image

TG: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీ ఇప్పట్లో అమలు కాకపోవచ్చని MLA కూనంనేని సాంబ శివరావు అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా ప్రభుత్వానికి కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో విమానాశ్రయం ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిస్థితి డోలాయమానంలో ఉందన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఎవరికీ రుపాయి కూడా ఇవ్వొద్దని సూచించారు.

News April 19, 2025

ఇలా చేస్తే కోటీశ్వరులు కావొచ్చు!

image

పెట్టుబడుల కోసం చాలా మార్గాలున్నా, సిప్(SIP) అనేది దీర్ఘకాలంలో మంచి లాభాలు ఇస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మంచి స్టాక్స్‌ను సెలెక్ట్ చేసుకొని నెలకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి పెట్టగలిగితే 15 ఏళ్లలో కోటి లేదా అంతకుమించి జమ చేసుకోవచ్చని తెలుపుతున్నారు. అయితే, మార్కెట్ల ఒడిదొడుకులు వల్ల స్వల్ప కాలంలో రాబడి ఉండదని, కనీసం పదేళ్లు కొనసాగిస్తామనే వారే SIP స్టార్ట్ చేయడం మంచిదని సూచిస్తున్నారు.

News April 19, 2025

బంగ్లాదేశ్‌లో హిందూ నేత హత్య

image

బంగ్లాలో హిందువులపై దాడి కొనసాగుతోంది. దీనాజ్‌పూర్‌ జిల్లాలో భాబేశ్ చంద్ర అనే హిందూ నేతను దుండగులు దారుణంగా కొట్టి చంపారు. బంగ్లాదేశ్ పూజా ఉద్యాపన్ పరిషద్ సంస్థకు ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. నలుగురు వ్యక్తులు బైక్స్‌పై వచ్చి ఆయన్ను కిడ్నాప్ చేశారని, మృతదేహాన్ని తిరిగి తీసుకొచ్చి ఇంటి ముందు పారేశారని కుటుంబీకులు పోలీసులకు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

error: Content is protected !!