News September 3, 2024
ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

AP: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గుంటూరు, బాపట్లకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కాకినాడ, తూ.గో, కోనసీమ, యానాం, ఏలూరు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Similar News
News August 5, 2025
స్వదేశానికి బయల్దేరిన భారత ఆటగాళ్లు

ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ను భారత్ నిన్న గెలుపుతో సమం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ఆటగాళ్లు స్వదేశానికి తిరిగొస్తున్నారు. అర్ష్దీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్ విమానంలో ప్రయాణిస్తున్న ఫొటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా చివరి టెస్టులో భారత్ ఉత్కంఠ విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి రోజు 35 పరుగులు చేయకుండా ప్రత్యర్థులను అడ్డుకుని చిరస్మరణీయ విజయం సాధించింది.
News August 5, 2025
‘సీతారామం’ విడుదలకు మూడేళ్లు.. నిర్మాత స్పెషల్ మెసేజ్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన వింటేజ్ లవ్ స్టోరీ ‘సీతారామం’ విడుదలై నేటికి మూడేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత స్వప్న దత్ ₹100 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు ఓ స్పెషల్ పోస్టర్ను ఇన్స్టాలో షేర్ చేశారు. ‘ఈ సినిమా ₹100 కోట్లను చేరుకుంటుందని ఈ పోస్టర్ రూపొందించాం. కానీ రూ.97కోట్ల వద్దే ఆగిపోయింది. నంబర్తో సంబంధం లేదని మూడేళ్లకు గ్రహించాం’ అని పోస్ట్ చేశారు.
News August 5, 2025
‘కాళేశ్వరం’పై చర్చ.. ఈ నెలలోనే అసెంబ్లీ సెషన్!

TG: కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముందుగా MLAలు, MLCలకు రిపోర్టును వివరించి అసెంబ్లీలో చర్చ పెట్టనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఈనెల మూడో వారంలో ప్రత్యేక సెషన్ నిర్వహించేందుకు క్యాబినెట్లో చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీలో చర్చించాక మండలాల వారీగా MLAలు మీటింగ్స్ పెట్టి ‘కాళేశ్వరం’ నివేదికపై వివరించనున్నట్లు తెలుస్తోంది.