News April 19, 2025
అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు

TG: రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇతర ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.
Similar News
News April 20, 2025
శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారిపై శవం

వంగూర్ గ్రామం సమీపంలోని శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందాడు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో మృతదేహం సమీపంలో ఉన్నాడు.
News April 20, 2025
చంద్రబాబుకు మోదీ, రేవంత్, చిరు శుభాకాంక్షలు

‘నా మిత్రుడు, CM చంద్రబాబుకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని PM మోదీ పోస్ట్ చేశారు. ‘నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ AP అభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలి’ అని TG సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ‘కృషి, పట్టుదల, అంకిత భావం ఉన్న అరుదైన నాయకులు మీరు. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం మీరు కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలి’ అని చిరంజీవి పోస్ట్ చేశారు.
News April 20, 2025
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండాయి. నిన్న 78,821 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 33,568 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చింది.