News October 25, 2024

రైతులకు అలర్ట్.. వ్యవసాయ శాఖ కీలక ప్రకటన

image

AP: రబీ నుంచి 2019కు ముందున్న పంటల బీమా విధానాన్నే అమలు చేయనున్నట్లు వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. PM ఫసల్ బీమా పథకానికి పంటల వారీగా నిర్ణయించిన ప్రీమియాన్ని రైతులే చెల్లించాలని తెలిపింది. లోన్లు తీసుకోని రైతులు గ్రామ సచివాలయాలు, ఉమ్మడి సేవా కేంద్రాల్లో ప్రీమియం చెల్లించవచ్చని, https://pmfby.gov.in/ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది. జీడిమామిడికి NOV 15లోగా ప్రీమియం చెల్లించాలని పేర్కొంది.

Similar News

News March 17, 2025

‘ట్రూత్ సోషల్’లో ప్రధాని మోదీ.. తొలి పోస్ట్ ఇదే

image

ట్రంప్ మీడియా&టెక్నాలజీ గ్రూప్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో భారత ప్రధాని మోదీ జాయిన్ అయ్యారు. ఈ వేదికపై అర్థవంతమైన చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. లెక్స్ ఫ్రైడ్‌మన్‌కు ఇచ్చిన తన ఇంటర్వ్యూ వీడియోను షేర్ చేసినందుకు US ప్రెసిడెంట్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ తన ప్రకటనలు ఎక్కువగా ‘ట్రూత్ సోషల్’లోనే చేస్తారన్న సంగతి తెలిసిందే.

News March 17, 2025

ఇంటికే భద్రాద్రి రామయ్య కళ్యాణ తలంబ్రాలు: TGSRTC

image

TG: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాలను భ‌క్తుల ఇళ్ల‌కు చేర్చనున్నట్లు TGSRTC తెలిపింది. త‌లంబ్రాలు కావాల్సిన భక్తులు TGSRTC లాజిస్టిక్స్ కేంద్రాలు, సంస్థ వెబ్‌సైట్‌లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది. సీతారాముల కళ్యాణం అయ్యాక తలంబ్రాలను హోం డెలివరీ చేస్తామని తెలిపింది. వివరాలకు 040-69440069, 040-69440000 నంబర్లలో సంప్రదించండి.

News March 17, 2025

రూ. లక్ష జీతంతో SBIలో ఉద్యోగాలు

image

రిటైల్ ప్రొడక్ట్స్ విభాగంలో 273 పోస్టుల భర్తీకి SBI దరఖాస్తులు కోరుతోంది. మేనేజర్ పోస్టులకు ఈ నెల 21, FLC కౌన్సెలర్/డైరెక్టర్ పోస్టులకు 26లోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. వయసు 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. MBA, PGDM, PGPM, MMS పాసై అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. sbi.co.inలో అప్లై చేయాలి. మేనేజర్‌కు రూ.85,920- రూ.1,05,280, FLC కౌన్సెలర్/డైరెక్టర్లకు రూ.50,000 ఇస్తారు.

error: Content is protected !!