News July 16, 2024

SBI కస్టమర్లకు అలర్ట్

image

స్టేట్ బ్యాంక్ ఇండియా కొత్తగా తీసుకొచ్చిన ‘అమృత్ వృష్టి’ FD పథకంలో 7.25% వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 0.50శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది. 2025 మార్చి 31 వరకు ఈ స్కీం అందుబాటులో ఉండనుంది. SBIలోని ఇతర FD పథకాలతో పోలిస్తే అత్యధిక వడ్డీ వచ్చే స్కీం ఇదే. SBI శాఖలు, యోనో SBI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా దీనిలో FD చేయవచ్చు. అటు 400 రోజులకు ‘అమృత్ కలశ్’ పేరిట అందించే పథకంలో 7.10% వడ్డీ లభిస్తోంది.

Similar News

News September 16, 2025

రానున్న 2-3 గంటల్లో వర్షం.. భారీగా ఈదురు గాలులు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, కరీంనగర్, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురవొచ్చని అంచనా వేసింది. గంటకు 41-61కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

News September 15, 2025

DANGER: నిద్ర మాత్రలు వాడుతున్నారా?

image

నిద్ర పట్టేందుకు కొందరు స్లీపింగ్ పిల్స్ వాడుతుంటారు. అయితే వీటి వాడకం ఎక్కువైతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జ్ఞాపకశక్తి తగ్గడం, తల తిరగడం, ఆందోళన, మెదడు బద్ధకించడం, చూపు అస్పష్టంగా మారడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. వరుసగా 2 రోజులు ఈ మాత్రలు వేసుకుంటే బానిసలవుతారని, డోస్ పెంచాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

News September 15, 2025

రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా: అచ్చెన్న

image

AP: రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 18వ తేదీలోపు కృష్ణపట్నం పోర్ట్ ద్వారా 11,605, కాకినాడ ద్వారా 18,765, మంగళూరు ద్వారా 2,700, జైగడ్ పోర్ట్ ద్వారా 8,100 MT యూరియా రవాణా జరుగుతుందని వెల్లడించారు. YCP కావాలనే యూరియా సరఫరాపై అబద్ధాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. రైతులను భయపెట్టి ప్రయోజనం పొందాలన్న ప్రయత్నం విజయవంతం కాదని హితవు పలికారు.