News November 14, 2024

సచివాలయ ఉద్యోగులకు అలర్ట్

image

AP: రాష్ట్ర సచివాలయశాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ విధానం నవంబర్ 1నుంచి 30వరకు అమలులో ఉంటుందని, జిల్లాల అధికారులు దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ముందు ఆగిపోయిన ఈ విధానాన్ని, తాజా నిర్ణయంతో మరోసారి అమలు చేయనున్నారు.

Similar News

News December 9, 2025

క్వార్టర్ మందు.. చికెన్ బిర్యానీ!

image

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం మరికాసేపట్లో ముగియనుండటంతో గ్రామాల్లో ప్రలోభాల పర్వం జోరందుకుంది. సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఓటుకు రూ.1000-4000 వరకు ఇస్తున్నట్లు సమాచారం. కొన్ని గ్రామాల్లో చికెన్ బిర్యానీ, క్వార్టర్, కూల్‌డ్రింక్స్ పంచుతున్నారు. మరికొన్ని చోట్ల ఇంటికి కేజీ కోడికూర పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? COMMENT

News December 9, 2025

రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌.. రెండో రోజు భారీగా పెట్టుబడులు

image

TG: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రెండో రోజు పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు రూ.1.11లక్షల కోట్ల పెట్టుబడులపై ప్రభుత్వంతో పలు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. పర్యాటక రంగంలో ₹7,045 కోట్లు, సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్ ₹10,000Cr, ఫెర్టిస్ ₹2000Cr, హెటిరో ₹1800Cr, JCK ఇన్ఫ్రా ₹9000Cr, AGP ₹6,750Cr, భారత్ బయోటెక్ ₹1000Cr పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా 40K+ ఉద్యోగాలు రానున్నాయి.

News December 9, 2025

మరో వివాదంలో కన్నడ హీరో దర్శన్!

image

బెంగళూరు పరప్పన జైలులో ఉన్న కన్నడ హీరో దర్శన్‌ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. దర్శన్ బ్యారక్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రేణుకాస్వామి హత్యకేసు నిందితుల్లో అనుకుమార్, జగ్గ, ప్రద్యూష్, లక్ష్మణ్‌లు తమను దర్శన్ వేధిస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. కొన్నిరోజుల క్రితం దర్శన్, జగ్గల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. తన ప్రాణాలు పోతాయని అనుకుమార్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.