News November 14, 2024

సచివాలయ ఉద్యోగులకు అలర్ట్

image

AP: రాష్ట్ర సచివాలయశాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ విధానం నవంబర్ 1నుంచి 30వరకు అమలులో ఉంటుందని, జిల్లాల అధికారులు దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ముందు ఆగిపోయిన ఈ విధానాన్ని, తాజా నిర్ణయంతో మరోసారి అమలు చేయనున్నారు.

Similar News

News December 6, 2025

TODAY HEADLINES

image

* గాంధీ చూపిన మార్గమే స్ఫూర్తి: పుతిన్
* రష్యా ఎప్పటినుంచో మిత్రదేశం: మోదీ
* ముగిసిన పుతిన్ పర్యటన.. కీలక ఒప్పందాలు
* 1000 ఇండిగో సర్వీసులు రద్దు.. CEO సారీ
* వినూత్న విద్యతోనే పిల్లల భవిష్యత్: CBN
* DEC 30, 31, JAN 1వ తేదీల్లో సాధారణ దర్శనాలు రద్దు: TTD
* ఇందిరమ్మ ఇల్లులేని ఊరు లేదు: రేవంత్
* ‘హిల్ట్’ కేసు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
* అఖండ-2 సినిమా విడుదల వాయిదా

News December 6, 2025

త్వరలో అఖండ-2 మూవీ కొత్త రిలీజ్ డేట్

image

బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తెరకెక్కిన <<18465729>>అఖండ-2<<>> చిత్రం రిలీజ్ ఆలస్యమైన విషయం తెలిసిందే. రేపైనా సినిమా విడుదలవుతుందని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే మూవీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. ‘సినిమాని విడుదల చేసేందుకు చాలా కష్టపడ్డాం. కానీ సాధ్యం కాలేదు. ఫ్యాన్స్, మూవీ లవర్స్‌ మమ్మల్ని క్షమించాలి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అని ట్వీట్ చేసింది.

News December 6, 2025

గ్లోబల్‌ సమ్మిట్‌ పూర్తిగా ఆర్థిక సదస్సు: CM

image

TG: భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ పూర్తిగా ఆర్థిక సదస్సని సమీక్షలో CM రేవంత్ పేర్కొన్నారు. ఏర్పాట్లు, ప్రోగ్రాం షెడ్యూల్‌‌ను అధికారులు వివరించారు. దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌‌లో ఈ గ్లోబల్ సమ్మిట్ విజయాన్ని ప్రదర్శించాలన్న ఆలోచనను CM వివరించారు. భవిష్యత్‌ వృద్ధి ప్రణాళికలను ప్రధానంగా చేర్చాలని, ఈ పత్రాన్ని ప్రజలకు డిజిటల్‌గా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.