News April 29, 2024
బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు అలర్ట్

TG: తెలంగాణ EAPCET-2024 (గతంలో ఎంసెట్) హాల్టికెట్లు విడుదలయ్యాయి. ప్రస్తుతం బైపీసీ విద్యార్థులకు చెందిన అగ్రికల్చర్, ఫార్మా హాల్టికెట్లను eapcet.tsche.ac.in/ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 1 నుంచి ఇంజినీరింగ్ హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఎంట్రన్స్ టెస్టు రాసేందుకు రూ.5000 లేట్ ఫీజుతో మే 1 వరకు అప్లై చేసుకోవచ్చు. మే 7, 8, 9, 10, 11 తేదీల్లో పరీక్షలు ఉంటాయి.
Similar News
News December 30, 2025
వరంగల్: మద్యం తాగి వాహనం నడిపిన 78 మందిపై కేసులు

మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై వరంగల్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కమిషనరేట్ పరిధిలో సోమవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో 78 మంది పట్టుబడ్డారు. ట్రాఫిక్ విభాగం పరిధిలో-43, ఈస్ట్ జోన్లో 15, వెస్ట్ జోన్ 14, సెంట్రల్ జోన్లలో 15 కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 30, 2025
Z: లోన్ తియ్.. ట్రిప్ వెయ్.. రిపీట్!

gen-Zలు గొప్పలకై అప్పులు చేస్తున్నారని హెల్తియన్స్ సర్వే వెల్లడించింది. 2025లో లోన్స్ తీసుకున్న 27% gen-Zల మెయిన్ రీజన్ ట్రిప్స్, కన్సర్ట్స్ వంటి లీజర్ యాక్టివిటీస్. R2: కాస్ట్లీ రెస్టారెంట్ ఫుడ్, బ్రాండెడ్ క్లోత్స్, లగ్జరీ లైఫ్ స్టైల్. R3: ఫోన్స్, ల్యాపీ, స్మార్ట్ వాచ్ వంటి టెక్ థింగ్స్. ఇంకో ట్రెండ్.. అప్పు తీర్చేందుకు మరో అప్పు చేయడం. ఇలా టెక్కులు, సోకుల కోసం Zలు లోన్ సైకిల్లో తిరుగుతున్నారు.
News December 30, 2025
పుతిన్ నివాసంపై దాడి వార్తలు.. మోదీ తీవ్ర ఆందోళన

పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి చేసిందన్న వార్తలపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ Xలో పోస్ట్ చేశారు. శాంతి నెలకొనాలంటే దౌత్యపరమైన చర్చలే మార్గమని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులు శాంతి యత్నాలను దెబ్బతీస్తాయన్నారు. అందరూ సంయమనంతో ఉండాలని కోరారు. అయితే పుతిన్ నివాసంపై తాము దాడి చేయలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యా చెబుతున్నవన్నీ అబద్ధాలని కొట్టిపారేశారు.


