News March 30, 2024
ALERT: ఇంట్లో ఉన్న ఆడవాళ్లే టార్గెట్!

భర్త ఆఫీస్కు వెళ్లాక, ఇంటి పని చేసుకొని కాసేపు సోషల్ మీడియాలో కాలక్షేపం చేసే ఆడవాళ్లే లక్ష్యంగా సైబర్ మోసాలు మొదలయ్యాయి. వారికి పార్ట్టైమ్ జాబ్ పేరుతో వల వేస్తున్నారు. ఫోన్తో ఇంట్లోనే కూర్చొని జాబ్ చేయవచ్చని, నెలకు ₹20వేల వరకూ సంపాదించుకోవచ్చని ఆశ పెడుతున్నారు. ఇంటి ఖర్చులకైనా అవుతాయని నమ్మి చాలామంది మోసపోతున్నారు. ఇలాగే తమిళనాడులోని కోయంబత్తూర్లో ఓ మహిళ రూ.4.63లక్షలు పోగొట్టుకున్నారు. SHARE
Similar News
News November 22, 2025
కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించాలి: DYFI

AP: కానిస్టేబుల్ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా శిక్షణ ప్రారంభించకపోవడంపై DYFI మండిపడింది. దీనివల్ల అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపింది. 6,100 మందికి వెంటనే ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది. ఈ పోస్టులకు 2022లో నోటిఫికేషన్ వెలువడగా లీగల్ సమస్యలతో ప్రక్రియ ఆలస్యమైంది. ఈ ఏడాది జూన్లో మెయిన్స్ నిర్వహించి AUGలో రిజల్ట్స్ ప్రకటించారు.
News November 22, 2025
విద్యార్థినుల కోసం కొత్త పథకం: మంత్రి లోకేశ్

AP: వచ్చే ఏడాది నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ‘దేశవిదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే విద్యార్థినులకు ఆర్థిక సాయం అందిస్తాం. ప్రస్తుతం విదేశాల్లో APకి చెందిన 27,112 మంది, స్వదేశంలో 88,196 మంది విద్యార్థినులు ఉన్నత చదువులు చదువుతున్నారు’ అని ట్వీట్ చేశారు.
News November 22, 2025
CSIR-NML 67 పోస్టులకు నోటిఫికేషన్

<


