News November 12, 2024

All in Red: అన్ని రంగాలు న‌ష్టాల్లోనే

image

Niftyలోని అన్ని రంగాల షేర్లు మంగ‌ళ‌వారం న‌ష్ట‌పోయాయి. ఆటో(1.94%), PSU Bank (1.92%), Financial Services స‌హా బ్యాంకు, FMCG, Metal, Pharma రంగ షేర్లు పతనమయ్యాయి. IT (0.05%), Realty (0.18%) స్వ‌ల్పంగా లాభ‌ప‌డ్డాయి. ఆగ‌స్టు 5వ తేదీన 23,900 ప‌రిధిలో Nifty స‌పోర్టు తీసుకుంది. ఇప్పుడు కూడా Day Chartలో అదే స్థాయిలో Red Candlestick ఫాం అవ్వ‌డంతో త‌దుప‌రి ఇన్వెస్ట‌ర్ల సెంటిమెంట్‌పై ఉత్కంఠ నెల‌కొంది.

Similar News

News October 27, 2025

భూ వినియోగ మార్పిడికి ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే అనుమతులు

image

AP: భూ వినియోగ మార్పులకు (చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్) ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే అనుమతులు మంజూరు కానున్నాయి. డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(DPMS) పోర్టల్ ద్వారా అప్లై చేసుకున్న 45 రోజుల్లోగా అనుమతులిస్తారు. రియల్ ఎస్టేట్ సంస్థలు, వ్యక్తులు ఆన్‌లైన్ దరఖాస్తుకు రూ.10 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను విడుదల చేసింది.

News October 27, 2025

కుక్కలా పని చేస్తున్నారంటూ పోస్ట్.. థాంక్స్ చెప్పిన ట్రంప్

image

US కోసం ట్రంప్ కుక్కలా పని చేస్తున్నారని ఉన్న ఓ SM పోస్ట్‌ను ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్‌లో షేర్ చేశారు. ‘థాంక్యూ.. అమెరికా గొప్ప పురోగతి సాధిస్తుంది’ అని దానికి క్యాప్షన్ ఇచ్చారు. ‘ఎలాంటి డబ్బు ఆశించకుండా ట్రంప్ కుక్కలా పని చేస్తున్నారు. అయినా ఆయన త్యాగాన్ని ఈ దేశం గుర్తించట్లేదు’ అని ఆ పోస్టులో రాసి ఉంది. దీంతో ట్రంప్ తనకు తానే లవ్ లెటర్స్ రాసుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

News October 27, 2025

పిలవని పేరంటానికి అందుకే వెళ్లొద్దంటారు

image

పిలవని పేరంటానికి వెళ్లడం ఆపదనే తెస్తుందనడానికి సతీదేవి కథే నిదర్శనం. దక్షుడు యాగానికి శివుడిని, సతీదేవిని ఆహ్వానించలేదు. అయినా పుట్టింటిపై మమకారంతో సతీదేవి భర్త శివుడి మాటను కాదని, బలవంతంగా ఆ యాగశాలకు వెళ్లింది. అక్కడ దక్షుడు శివుడిని అవమానించడం చూసి, ఆ అవమానాన్ని భరించలేకపోయింది. యోగాగ్నిలో దేహత్యాగం చేసింది. పిలవని చోటికి వెళ్లడం వల్ల ఎంతటి నష్టం కలుగుతుందో ఈ ఘటన మనకు చెబుతోంది.<<-se>>#Shakthipeetham<<>>