News November 12, 2024
All in Red: అన్ని రంగాలు నష్టాల్లోనే

Niftyలోని అన్ని రంగాల షేర్లు మంగళవారం నష్టపోయాయి. ఆటో(1.94%), PSU Bank (1.92%), Financial Services సహా బ్యాంకు, FMCG, Metal, Pharma రంగ షేర్లు పతనమయ్యాయి. IT (0.05%), Realty (0.18%) స్వల్పంగా లాభపడ్డాయి. ఆగస్టు 5వ తేదీన 23,900 పరిధిలో Nifty సపోర్టు తీసుకుంది. ఇప్పుడు కూడా Day Chartలో అదే స్థాయిలో Red Candlestick ఫాం అవ్వడంతో తదుపరి ఇన్వెస్టర్ల సెంటిమెంట్పై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News December 18, 2025
గర్భంతో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చెయ్యొద్దు

గర్భధారణ సమయంలో ఒకే పొజిషన్లో ఎక్కువ సేపు ఉండడం అంత మంచిది కాదు. ప్రెగ్నెన్సీలో ఆరోగ్య సమస్యలకు సొంత వైద్యం పనికిరాదు. బరువైన వస్తువులను ఎత్తడం, అధిక పని చేయడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి. మద్యం, ధూమపానం చేయకూడదు. కెఫీన్ తగ్గించాలి. పచ్చి ఆహారాలను తినకూడదని సూచిస్తున్నారు. సమయానికి తగ్గట్లు స్కానింగ్లు చేయించుకోవాలి.
News December 18, 2025
గురువారం రోజు చేయకూడని పనులివే..

గురువారం బృహస్పతి గ్రహంతో అనుసంధానమై ఉంటుంది. వాస్తు ప్రకారం ఈ రోజున కొన్ని వస్తువులు కొనడం మంచిది కాదని నమ్ముతారు. నలుపు రంగు వస్తువులు, బూట్లు, నూనె, ఇనుము/స్టీల్ వస్తువులు కొనడం అశుభమని పండితులు చెబుతున్నారు. అలాగే ఆస్తి లావాదేవీలు చేపడితే ప్రతికూల ప్రభావాలు కలగొచ్చంటున్నారు. నేడు జుట్టు, గోళ్లను కత్తిరించకూడదట. అయితే శత్రువుల బెడద తగ్గడానికి మట్టి కుండ కొనాలని సూచిస్తున్నారు.
News December 18, 2025
దావోస్కు సీఎం రేవంత్.. కోర్టు గ్రీన్ సిగ్నల్

TG: ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF)లో పాల్గొనేందుకు CM రేవంత్ రెడ్డికి ACB కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరిలో స్విట్జర్లాండ్లో జరిగే WEFకు హాజరయ్యేందుకు అనుమతి కోరగా రూ.10 వేల పూచీకత్తుపై అనుమతించింది. మార్చి 3 లోపు పాస్పోర్టు తిరిగి అప్పగించాలని స్పష్టం చేసింది. 2015 ఓటుకు నోటు కేసులో బెయిల్ షరతుల ప్రకారం రేవంత్ పాస్పోర్టు కోర్టు అధీనంలో ఉంది. జనవరి 19-23 వరకు దావోస్లో CM పర్యటించనున్నారు.


