News October 8, 2025
ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్రీడర్

ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్రీడర్ జోలెపాళ్యం మంగమ్మ 1925 సెప్టెంబర్12న మదనపల్లెలో జన్మించారు. ఈమె MA,BEd, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. 1960లో AIRలో చేరి న్యూస్రీడర్గా, ఎడిటర్గా పనిచేశారు. కేంద్రసమాచారశాఖ, విదేశాంగశాఖల్లో కీలక పదవులు చేపట్టారు. ఈమెకు ENG, ఫ్రెంచ్, ఎస్పరాంటో, తమిళ, హిందీభాషల్లో ప్రావీణ్యం ఉంది.<<-se>>#firstwomen<<>>
Similar News
News February 17, 2026
ధురంధర్ మేకర్స్కు షాక్.. బ్లాక్లిస్ట్లో ప్రొడక్షన్ హౌస్?

ధురంధర్ సీక్వెల్పై భారీ అంచనాలు నెలకొన్న వేళ ఆ ఫిల్మ్ మేకర్స్కు షాక్ తగిలింది. ఈ సినిమా నిర్మాణ సంస్థ B62 స్టూడియోస్ను శాశ్వతంగా బ్లాక్లిస్ట్ చేసేందుకు ముంబై కార్పొరేషన్(BMC) సిద్ధమైంది. అనుమతులు లేకుండా భవనాలపై షూటింగ్లు చేసి వరుస ఉల్లంఘనలకు పాల్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. బ్లాక్లిస్ట్ అయితే భవిష్యత్తులో ముంబైలో షూటింగ్ చేపట్టేందుకు నిర్మాణ సంస్థకు అనుమతులు లభించవు.
News February 17, 2026
పాలపళ్లను శుభ్రం చేస్తున్నారా?

పాలపళ్లు ఊడిపోయేవే కదా అని చాలామంది పేరెంట్స్ వాటిపై శ్రద్ధ చూపరు. కానీ ఇవి నోటి నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. ఇవి దవడ ఎముక వృద్ధి చెందటానికి మార్గం చూపించడంతో పాటు శాశ్వత దంతాలకు అవసరమైన చోటును కల్పిస్తాయి. తొలి దంతం రావటానికి ముందు నుంచే శిశువుల నోటిని శుభ్రం చేయాలని చెబుతున్నారు. రోజుకు రెండుసార్లు బట్టతో/మెత్తటి బ్రష్తో శుభ్రం చేయాలని సూచిస్తున్నారు.
News February 17, 2026
ఒత్తిడే అసలు శత్రువు!

మానసిక ఒత్తిడి గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘మనం ఒత్తిడికి గురైనప్పుడు మెదడులోని నాడీ వ్యవస్థ వేగంగా స్పందిస్తుంది. దీనివల్ల BP, హార్ట్ బీట్ పెరగడమే కాకుండా రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఇది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచి చివరికి గుండెపోటుకు దారితీస్తుంది. గుండె ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం వంటి పద్ధతుల ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి’అని సూచిస్తున్నారు.


