News October 8, 2025
ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్రీడర్

ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్రీడర్ జోలెపాళ్యం మంగమ్మ 1925 సెప్టెంబర్12న మదనపల్లెలో జన్మించారు. ఈమె MA,BEd, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. 1960లో AIRలో చేరి న్యూస్రీడర్గా, ఎడిటర్గా పనిచేశారు. కేంద్రసమాచారశాఖ, విదేశాంగశాఖల్లో కీలక పదవులు చేపట్టారు. ఈమెకు ENG, ఫ్రెంచ్, ఎస్పరాంటో, తమిళ, హిందీభాషల్లో ప్రావీణ్యం ఉంది.<<-se>>#firstwomen<<>>
Similar News
News October 8, 2025
‘దీపావళి’ వెలుగులు నింపాలి.. విషాదం కాదు!

దీపావళి అనగానే ‘బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. కార్మికులు సజీవ దహనం’ అనే వార్తలు వింటూ ఉంటాం. తాజాగా AP కోనసీమ జిల్లాలోనూ అలాంటి ప్రమాదమే జరిగి ఏడుగురు సజీవదహనమయ్యారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తరచూ బాణసంచా తయారీ కేంద్రాలు, దుకాణాలను తనిఖీ చేయాలి. ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి. కార్మికులకు జీవిత బీమా చేయించాలి. ఈ పండుగ కార్మికుల కుటుంబాల్లో విషాదం నింపకుండా చూసుకోవాలి.
News October 8, 2025
రేపు భారీ వర్షాలు: APSDMA

AP: ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 2 రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. రేపు అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇవాళ NTR, GNT, బాపట్ల, అనంత, సత్యసాయి తదితర జిల్లాల్లో వర్షం పడింది.
News October 8, 2025
రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ: టీపీసీసీ చీఫ్

TG: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్కు ఎలాంటి అడ్డంకులు లేవని, షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. కోర్టులో తమ లాయర్లు బలమైన వాదనలు వినిపించారని, రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ ఉంటుందని చెప్పారు. బీసీ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని, కోర్టులోనూ కచ్చితంగా గెలుస్తామన్నారు. రాష్ట్రంలో 90% స్థానాలను తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.