News March 16, 2024
ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసినందున జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శనివారం అయన హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో పార్లమెంటు ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News February 5, 2026
నల్గొండ: పుట్టింటికి భార్య.. యువకుడి సూసైడ్

తాగుడుకు బానిసై ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కట్టంగూరు(M) ఇస్మాయిల్ పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొత్త నాగరాజు (29) తాపీ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తాగుడుకు బానిసయ్యాడని అతని భార్య కుమార్తెను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
News February 5, 2026
నల్గొండ: ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశాలకు ఆహ్వానం

ఎస్సీ స్టడీ సర్కిల్స్ ప్రవేశాలకు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా అధికారి శశికళ తెలిపారు. అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని, మార్చి 1న నల్గొండ ఎన్జీ కళాశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని, హాల్ టికెట్లను ఈ నెల 25 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News February 4, 2026
MLG: హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ వార్డెన్లను ఆదేశించారు. బుధవారం మిర్యాలగూడలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గదులు, వంటశాల, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.


