News October 25, 2024
అవన్నీ జగన్ సొంత ఆస్తులు కాదు: షర్మిల

AP: జగన్తో ఆస్తుల గొడవలపై YS షర్మిల 3 పేజీల లేఖను విడుదల చేశారు. ‘స్వార్జితం అని జగన్ చెప్పుకుంటున్న ఆస్తులన్నీ కుటుంబానివే. ఆయన గార్డియన్ మాత్రమే. 2019లో సీఎం అయ్యాక విడిపోదామా? అని జగన్ ప్రతిపాదన పెట్టారు. సాక్షి, భారతి సిమెంట్స్లో 60% వాటా తీసుకుంటానంటే, ఒప్పుకోలేదని మాపై కేసు వేశారు. నాన్న పేరు చెడిపోతుందని మౌనంగా ఉన్నాం. కొడుకే తల్లిని కోర్టుకు ఈడ్చటం ఎంత అవమానం?’ అని లేఖలో పేర్కొన్నారు.
Similar News
News December 12, 2025
రెండో విడతలోనూ పై‘చేయి’కి కసరత్తు

TG: నిన్న ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. 2,200+ స్థానాల్లో గెలిచారు. బీఆర్ఎస్ 1,100+, బీజేపీ 180+ స్థానాల్లో విజయం సాధించారు. తొలి విడతలో చూపిన జోరునే ఈ నెల 14న జరిగే రెండో విడత పోలింగ్లోనూ కొనసాగించాలని హస్తం పార్టీ కసరత్తు చేస్తోంది. 4,332 పంచాయతీలు, 38,322 వార్డులకు ఆ రోజు ఎన్నికలు జరగనున్నాయి.
News December 12, 2025
IIM రాంచీలో నాన్ టీచింగ్ పోస్టులు.. దరఖాస్తు చేశారా?

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాంచీలో 5 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, LLB, M.Phil/MA క్లినికల్ సైకాలజీ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. వెబ్సైట్: https://iimranchi.ac.in
News December 12, 2025
18 మెట్లు.. 18 దేవతల ఆశీర్వాదం

అయ్యప్ప దర్శనార్థం శబరిలో 18 మెట్లు ఎక్కిన భక్తులు 18 దేవతల ఆశీస్సులు పొందుతారని, వారి జీవితంలోని కష్టాలు పోతాయని నమ్మకం. ఆ 18 మంది దేవతలు వీరే: 1.మహంకాళి 2.కళింకాళి 3.భైరవ 4.సుబ్రహ్మణ్యం 5.గంధర్వరాజ 6.కార్తవీర్య 7.క్రిష్ణ పింగళ 8.భేతాళ 9.మహిషాసుర మర్దని 10.నాగరాజ 11.రేణుకా పరమేశ్వరి 12.హిడింబ 13.కర్ణ వైశాఖ 14.అన్నపూర్ణేశ్వరి 15.పుళిందిని 16.స్వప్న వారాహి 17.ప్రత్యంగళి 18.నాగ యక్షిణి. <<-se>>#AyyappaMala<<>>


