News October 17, 2024
46 పరుగులకు ఆలౌట్.. కెప్టెన్ రోహిత్ ఏమన్నారంటే?

న్యూజిలాండ్తో టెస్టులో తొలి ఇన్నింగ్సులో భారత్ 46 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిచ్ను తానే తప్పుగా అంచనా వేసినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పారు. పిచ్ ఫ్లాట్గా ఉంటుందని భావించానని, సరిగా అర్థం చేసుకోలేకపోయానన్నారు. మరోవైపు రాహుల్ స్థానాన్ని పదే పదే మార్చడం ఇష్టం లేకనే కోహ్లీని ఫస్ట్ డౌన్లో పంపినట్లు పేర్కొన్నారు. జట్టులో ప్లేయర్లు సామర్థ్యానికి తగినట్లుగా ఆడలేకపోయారన్నారు.
Similar News
News November 24, 2025
UCIL 107 ఉద్యోగాలకు నోటిఫికేషన్

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<
News November 24, 2025
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రూ.304 కోట్లు జమ

TG: రాష్ట్ర ప్రభుత్వం రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో ఈ నగదు జమ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో డీఆర్డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.
News November 24, 2025
VIRAL: ట్రంప్ జూనియర్తో రామ్ చరణ్

US ఫార్మా దిగ్గజం రామరాజు మంతెన కుమార్తె వివాహ వేడుక ఉదయ్పూర్లోని రాజభవనంలో ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ను కలుసుకున్నారు. వీరిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్న ఫొటో ఒకటి వైరలవుతోంది. ఇదీ చరణ్ రేంజ్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.


