News September 1, 2025
నేడు గవర్నర్ వద్దకు అఖిలపక్ష నేతలు

TG: అసెంబ్లీలో ఆమోదించిన పంచాయతీ రాజ్ చట్టం-2018 సవరణ బిల్లును ఆమోదించాలని కోరేందుకు ఇవాళ అఖిలపక్ష నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. తమతో కలిసి రావాలని అన్ని పార్టీల కీలక నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న లేఖలు రాశారు. ‘రిజర్వేషన్ పరిమితిపై అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్న విషయాన్ని గవర్నర్ పరిగణనలోకి తీసుకోవాలి. బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఇబ్బంది ఏముంది?’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
Similar News
News September 4, 2025
కామారెడ్డి జిల్లాలో నేడు సీఎం పర్యటన

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కామారెడ్డి జిల్లాలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు HYD నుంచి బయలుదేరి 11.30కి లింగంపేట(M) మోతె గ్రామానికి చేరుకుంటారు. వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలిస్తారు. 1:10PMకు కామారెడ్డి టౌన్లోని జీఆర్ కాలనీలో పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తారు. 2:20PMకు కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్షిస్తారు.
News September 4, 2025
GREAT.. 10th చదివి ఆర్థిక క్రమశిక్షణతో రూ.కోటి పొదుపు!

ఆర్థిక క్రమశిక్షణతో ఎంతో మందికి ప్రేరణగా నిలిచిన ఓ వ్యక్తి కథ నెటిజన్లను మెప్పిస్తోంది. తాను పదో తరగతి మాత్రమే చదివి 25 ఏళ్లలో రూ.కోటి పొదుపు చేసినట్లు 53 ఏళ్ల వ్యక్తి రెడిట్లో పోస్ట్ చేయగా వైరలవుతోంది. తాను నెలకు రూ.4,200 జీతంతో జీవితాన్ని ప్రారంభించానని, ఎప్పుడూ అప్పు చేయలేదని, క్రెడిట్ కార్డు వాడలేదని తెలిపారు. చాలావరకూ నడుస్తూనే వెళ్తానని, ఈ మధ్యే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నానన్నారు.
News September 4, 2025
సెప్టెంబర్ 4: చరిత్రలో ఈ రోజు

1825: జాతీయ నేత దాదాభాయి నౌరోజీ జననం(ఫొటోలో)
1924: కేంద్ర మాజీ మంత్రి కె.వి.రఘునాథరెడ్డి జననం
1926: శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత బాలు శంకరన్ జననం(ఫొటోలో, కుడివైపు)
1962: భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే జననం
1980: తెలుగు సింగర్, డాన్సర్ స్మిత జననం
1983: పాత తరం తెలుగు సినీ నటి ఛాయాదేవి మరణం
2007: తెలుగు, తమిళ, హిందీ నటి వై.రుక్మిణి మరణం
* జాతీయ వన్యప్రాణుల దినోత్సవం