News March 31, 2024
ప్రజలంతా ప్రభుత్వ బాధితులే: పురందీశ్వరి

AP: వైసీపీ రాక్షస పాలనలో ప్రజలంతా ప్రభుత్వ బాధితులేనని బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి విమర్శలు చేశారు. నా బీసీ అంటూ సీఎం జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ మాట ఆయన పెదాలపై తప్ప గుండెల్లో లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా రూ.2లక్షలకు పైగా రుణ భారం ఉందన్నారు. ఇవి సరిపోవన్నట్టుగా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెడుతున్నారని విమర్శించారు.
Similar News
News January 29, 2026
Oh Sh*t.. పైలట్ల ఆఖరి మాటలు ఇవే

బారామతి ఫ్లైట్ క్రాష్లో మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పైలట్ ఇన్ కమాండ్ సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ శాంభవి కూడా ప్రాణాలు కోల్పోయారు. క్రాష్ ల్యాండింగ్కి ముందు వాళ్లు మాట్లాడిన ఆఖరి మాటలు కాక్పిట్లో రికార్డ్ అయ్యాయి. వాళ్లు కొన్ని క్షణాల ముందు ‘Oh Sh*t’ అని కేకలు వేసినట్లు DGCA సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాసేపట్లో అజిత్ పవార్ అంత్యక్రియలు జరగనున్నాయి.
News January 29, 2026
APPLY NOW: ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 97 పోస్టులు

<
News January 29, 2026
ఒకే రోజు రూ.25వేలు పెరిగిన కేజీ సిల్వర్ ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ సిల్వర్ రేటు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.25వేలు పెరిగి రూ.4,25,000కు చేరింది. కేవలం 3 రోజుల్లోనే రూ.50వేలు పెరిగి ఇన్వెస్టర్లకు భారీ లాభాన్నిచ్చింది. ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో సిల్వర్ వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడమే ఈ పెరుగుదలకు కారణం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


