News August 10, 2024
జగన్ చేసిన పెంటకు అన్ని వ్యవస్థలు నాశనం: TDP

AP: చంద్రబాబు హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న <<13824303>>జగన్<<>> విమర్శలకు TDP కౌంటర్ ఇచ్చింది. ‘రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని ఒప్పుకున్నందుకు సంతోషం. నువ్వు చేసిన పెంటకు అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయి. వాటిని చక్కదిద్దే పనిలో ఉన్నారు చంద్రబాబు. నీ ప్రత్యేక హోదా, 45 ఏళ్లకు పెన్షన్, సన్నబియ్యం, వారంలో సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయి?’ అని Xలో ప్రశ్నించింది.
Similar News
News March 25, 2026
రైలులో ప్రయాణిస్తున్నారా.. ఇది తెలుసా?

రైలు ప్రయాణికులకు కొన్ని నిబంధనలపై అవగాహన ఉండకపోవచ్చు. ఈక్రమంలో మిడిల్ బెర్త్ కేటాయిస్తే రాత్రి 10గంటల నుంచి ఉదయం 6 వరకు మాత్రమే ఉపయోగించాలని సదరన్ రైల్వే ట్వీట్ చేసింది. అయితే దీనిని ఎవరూ పాటించట్లేదని, ఈ నిబంధన స్టిక్కర్ను కోచ్లలో అంటించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా చేస్తే అర్ధరాత్రి ట్రైన్ ఎక్కిన ప్రయాణికులకు నిద్ర ఉండదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News March 25, 2026
షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

పశ్చిమాసియాలో యుద్ధం, దాని పరిణామాలపై చర్చించేందుకు ఈ సాయంత్రం అఖిలపక్ష సమావేశం జరగనుంది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు. ప్రభుత్వం తరఫున ఐదారుగురు మంత్రులు ఈ భేటీకి హాజరుకానున్నారు. విదేశాంగ శాఖ కార్యదర్శి తాజా పరిస్థితులను నేతలకు వివరించనున్నారు. అటు తెలంగాణ సీఎం రేవంత్ ఇంధన పరిస్థితులపై ఈ మధ్యాహ్నం 2 గం.కు అధికారులతో సమీక్షించనున్నారు.
News March 25, 2026
చమురు వణుకుపుట్టిస్తోంది!

ప్రపంచంలో ఆయిల్ కొరత అతిపెద్ద సమస్యగా మారింది. గల్ఫ్తో పాటు ఇతర వనరులూ దాడులకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభానికి ప్రత్యామ్నాయం అనుకున్న రష్యన్ రిఫైనరీలూ ఇప్పుడు టార్గెట్గా మారాయి. ఇటీవల రష్యా రిఫైనరీలోని కోటి లీటర్ల స్టోరేజ్ ట్యాంక్పై ఉక్రెయిన్ దాడి చేసింది. మరోవైపు USలోని టెక్సాస్ రిఫైనరీలో పేలుడు సంభవించింది. ఫలితంగా గ్లోబల్ సప్లై చెయిన్కు అంతరాయం ఏర్పడుతోంది.


