News August 10, 2024
జగన్ చేసిన పెంటకు అన్ని వ్యవస్థలు నాశనం: TDP

AP: చంద్రబాబు హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న <<13824303>>జగన్<<>> విమర్శలకు TDP కౌంటర్ ఇచ్చింది. ‘రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని ఒప్పుకున్నందుకు సంతోషం. నువ్వు చేసిన పెంటకు అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయి. వాటిని చక్కదిద్దే పనిలో ఉన్నారు చంద్రబాబు. నీ ప్రత్యేక హోదా, 45 ఏళ్లకు పెన్షన్, సన్నబియ్యం, వారంలో సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయి?’ అని Xలో ప్రశ్నించింది.
Similar News
News October 21, 2025
కూటమి VS కూటమి.. ప్రత్యర్థుల విమర్శలు

బిహార్లో మహా కూటమిలో విభేదాలు ప్రత్యర్థులకు విమర్శనాస్త్రాలుగా మారాయి. కాంగ్రెస్, RJD, CPI, VIP పార్టీలు గ్రాండ్ అలయెన్స్గా ఏర్పడ్డాయి. అయితే 11 స్థానాల్లో కూటమి నేతలే పరస్పరం పోటీకి నామినేషన్లు దాఖలు చేశారు. 6 సీట్లలో RJD, కాంగ్రెస్, 4 స్థానాల్లో కాంగ్రెస్, CPI, మరో 2 చోట్ల RJD, VIP అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు. NDA గెలుపునకు కూటమి బాటలు వేసిందని LJP చీఫ్ చిరాగ్ పాస్వాన్ విమర్శించారు.
News October 21, 2025
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గుందా: కేటీఆర్

TG: తమ పార్టీలో ఉన్నామంటున్న MLAల పేర్లు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉండటం ఏంటని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రశ్నించారు. ‘ఏ పార్టీలో ఉన్నావంటే చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. వారికి సిగ్గుందా?’ అని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆలిండియా కరప్షన్ కమిటీ అని, దానికి ఖర్గే, రాహుల్ గాంధీ నాయకులని ఖైరతాబాద్లో బస్తీ దవాఖానా సందర్శన సందర్భంగా KTR విమర్శించారు.
News October 21, 2025
రేపటి నుంచే కార్తీక మాసం

ఇవాళ్టితో ఆశ్వయుజ మాసం ముగిస్తుంది. రేపటి(OCT 22) నుంచి శివారాధనకు విశిష్టమైన కార్తీక మాసం ప్రారంభమై నవంబర్ 20 వరకు కొనసాగుతుంది. ఈ నెలలో పరమేశ్వరుడిని విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. మిగతా మాసాలతో పోలిస్తే ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనదని స్కంద పురాణంలో పేర్కొన్నారు. ఉదయం, సాయంత్ర వేళల్లో దీపాలు వెలిగిస్తూ, పూజలు, వ్రతాలు, ఉపవాస దీక్షలు, వనభోజనాలతో ఈ మాసమంతా భక్తిపారవశ్యంతో మునిగిపోతుంది.