News October 13, 2025
ALL THE BEST: నేడు స్కూళ్లకు కొత్త టీచర్లు

AP: మెగా DSCలో ఎంపికైన నూతన టీచర్లు ఇవాళ విధుల్లో చేరనున్నారు. అటు వివిధ శాఖల్లో పని చేస్తూ జాబ్ సాధించిన వారు సైతం అక్కడ రిలీవ్ అయి బాధ్యతలు చేపట్టనున్నారు. ఉద్యోగం సాధించేందుకు వారు పడిన కష్టాలు తీరి నచ్చిన వృత్తిలోకి నేడు అడుగుపెట్టనుండగా, ఆ క్షణాలు ఎమోషనల్గా మారనున్నాయి. ఉపాధ్యాయ వృత్తికి మరింత విలువ తెస్తూ భావిభారత పౌరులను తీర్చిదిద్దాలని కోరుకుంటూ వారందరికీ Way2News తరఫున ALL THE BEST.
Similar News
News October 13, 2025
నేడు విధుల్లోకి టూరిస్టు పోలీసులు

TG: రాష్ట్రంలోని టూరిస్ట్ పోలీస్ వ్యవస్థ అమల్లోకి రానుంది. శిక్షణ పూర్తి చేసుకున్న 80 మంది టూరిస్టు పోలీసులు నేడు విధుల్లో చేరనున్నారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు రక్షణ కల్పించేలా పలు అంశాలపై వీరికి శిక్షణ ఇచ్చారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలైన యాదాద్రి, భద్రాచలం, కీసరగుట్ట, సోమశిల తదితర ఆలయాలతో పాటు చార్మినార్, గోల్కొండ, అనంతగిరి హిల్స్ వంటి సందర్శక ప్రాంతాల్లో వీరు అందుబాటులో ఉంటారు.
News October 13, 2025
ఐదేళ్లలో 30శాతానికి మహిళా ఉద్యోగులు: SBI

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI 2030కల్లా మహిళా ఉద్యోగుల వాటాను 30శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న 2.40 లక్షల సిబ్బందిలో వీరి వాటా 27%గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మహిళలకు అనువైన పని వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. మహిళలకు నాయకత్వ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని వివరించారు.
News October 13, 2025
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 6 అసిస్టెంట్ ప్రొఫెసర్(ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://sportsauthorityofindia.gov.in/