News June 4, 2024
ఆ ఇద్దరు తప్ప మాజీ సీఎంల వారసులంతా గెలుపు

AP: రాష్ట్రంలో ఎనిమిది మంది మాజీ సీఎంల వారసులు ఎన్నికల కదనరంగంలో కాలుదువ్వారు. ఇందులో YS జగన్, నారా లోకేశ్, బాలకృష్ణ, పురందీశ్వరి(BJP), కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి(TDP), నాదెండ్ల మనోహర్(జనసేన) విజయదుందుభి మోగించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, నేదురుమల్లి రామ్కుమార్(వెంకటగిరి, వైసీపీ) ఓటమి పాలయ్యారు. కాగా లోకేశ్, కోట్ల తొలిసారి ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి వెళ్లనున్నారు.
Similar News
News December 4, 2025
ఎల్లుండి నుంచి APP పరీక్షల హాల్ టికెట్లు

TG: 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల పరీక్షా హాల్ టికెట్లను ఈ నెల 6వ తేదీ ఉ.8గం. నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని TSLPRB ప్రకటించింది. 13వ తేదీ రాత్రి 12గం. వరకు సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈనెల 14న రాత పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఉ.10గం. నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్-1(ఆబ్జెక్టివ్), మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గం. వరకు పేపర్-2(డిస్క్రిప్టివ్) ఉంటాయని తెలిపింది.
News December 4, 2025
APPLY NOW: టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు

<
News December 4, 2025
మొక్కజొన్న కోత, నిల్వలో తేమ ముఖ్యం

మొక్కజొన్న పంట కోత సమయంలో తేమ కీలకమని, రైతులు సరైన సమయంలో కోత చేపడితే మంచి ధర పొందవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు. గింజల్లో 25 నుంచి 30 శాతం తేమ ఉన్నప్పుడు కోత చేపట్టి కండెలను 2-3 రోజులు ఎండలో ఆరబెట్టాలి. సుమారు 15 శాతం తేమ ఉన్నప్పుడు నూర్పిడి యంత్రాల సహాయంతో నూర్పిడి చేసి గింజలను ఎండబెట్టాలి. గోదాములలో నిల్వ చేయాలనుకుంటే సుమారు 10 శాతం తేమ ఉన్న గింజలను నిల్వచేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


