News March 23, 2024
ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే: సత్యకుమార్ యాదవ్

AP: అధికారులు మోసం చేశారంటూ కుటుంబం <<12908035>>ఆత్మహత్య<<>> చేసుకున్న ఘటనపై BJP జాతీయ నేత సత్యకుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘సొంత జిల్లాలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నా CMకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఈ ఆత్మహత్యలన్నీ YCP ప్రభుత్వ హత్యలే. ప్రజల నుంచి దోచుకున్న ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకే భూ యాజమాన్య చట్టం తెచ్చారు. అధికారంలోకి రాగానే ప్రతి పైసా కక్కిస్తాం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News April 18, 2025
మోదీ పర్యటన.. ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రులతో కమిటీ

AP: PM మోదీ మే 2న అమరావతికి రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దాదాపు 5 లక్షల మంది ప్రజలు కూర్చునేలా సభా ప్రాంగణం కోసం 100 ఎకరాలు, పార్కింగ్ కోసం 250 ఎకరాలను సిద్ధం చేస్తున్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రభుత్వం మంత్రులతో కమిటీని నియమించింది. అందులో లోకేశ్, పయ్యావుల, నారాయణ, సత్యకుమార్, నాదెండ్ల, రవీంద్ర ఉన్నారు. నోడల్ అధికారిగా IAS వీరపాండ్యన్ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది.
News April 18, 2025
అతడి ప్రశాంతత వల్ల మాపై ఒత్తిడి తగ్గింది: భువనేశ్వర్

RCB కెప్టెన్ రజత్ పాటీదార్ నాయకత్వ బాధ్యతల్ని అద్భుతంగా నిర్వర్తిస్తున్నారని ఆ జట్టు బౌలర్ భువనేశ్వర్ కొనియాడారు. ‘రజత్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఈ ఫార్మాట్లో అలా ఉండటం చాలా కీలకం. కొంతమంది ఒక మ్యాచ్ కోల్పోగానే టెన్షన్ పడిపోతారు. కానీ రజత్ జయాపజయాల్ని సమానంగా తీసుకుంటాడు. ఓడినప్పుడు ఎలా ఉన్నాడో, గెలిచినప్పుడూ అలాగే ఉన్నాడు. అతడి ప్రశాంతత కారణంగా మాపై ఒత్తిడి తగ్గింది’ అని తెలిపారు.
News April 18, 2025
జేఈఈ మెయిన్ ‘కీ’ విడుదల

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫైనల్ ‘కీ’ని ఎట్టకేలకు NTA విడుదల చేసింది. <