News July 6, 2024
ఆ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలి: నిరంజన్ రెడ్డి

TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ నేతలకు ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేదా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాసినట్లు మీడియాతో పేర్కొన్నారు. దీనిపై ఆయన స్పందించాలని కోరారు. ఆరు గ్యారంటీల ఊసెత్తకుండా ఇలాగే పాలన కొనసాగితే ప్రజలు ఉపేక్షించరని దుయ్యబట్టారు.
Similar News
News December 17, 2025
అమరావతి: AGICL ఎండీగా SVR శ్రీనివాస్ బాధ్యతలు

అమరావతి గ్రోత్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(AGICL) MDగా రిటైర్డ్ IAS అధికారి SVR శ్రీనివాస్ బుధవారం రాయపూడిలోని CRDA కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. AGICL ఎండీగా నియమితులైన SVR శ్రీనివాస్కు పలువురు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. 1989 IAS బ్యాచ్కు చెందిన SVR శ్రీనివాస్ మహారాష్ట్ర క్యాడర్కు చెందినవారు కాగా..పాలనా సంస్కరణలు, పట్టణాభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు.
News December 17, 2025
OFFICIAL: నాలుగో టీ20 రద్దు

IND-SA నాలుగో T20 రద్దయింది. లక్నోలో AQI అతి ప్రమాదకర స్థాయిలో 391గా రికార్డైంది. పలుమార్లు పిచ్ను పరిశీలించిన అంపైర్లు ఆట సాధ్యం కాదని ప్రకటించారు. కాగా ఇప్పటికే జరిగిన 3 టీ20ల్లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఐదో టీ20 ఈ నెల 19న అహ్మదాబాద్లోని మోదీ స్టేడియంలో జరగనుంది. కాగా లక్నోలో పొగమంచు, పొల్యూషన్ తీవ్రంగా ఉండటంతో మ్యాచ్ రద్దు అవుతుందని గంట క్రితమే <<18596625>>Way2News అంచనా<<>> వేసింది. ఇప్పుడదే నిజమైంది.
News December 17, 2025
రిజల్ట్స్: కూతురిపై తండ్రి.. తల్లిపై కూతురు విజయం

TG: మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర విజయాలు చోటుచేసుకున్నాయి. ఖమ్మం(D)లోని పెనుబల్లిలో తల్లి తేజావత్పై కూతురు బానోతు పాపా గెలుపొందారు. నారాయణపేటలోని కోల్పూరులో కూతురిపై తండ్రి రాములు 420 ఓట్ల తేడాతో గెలుపొందారు. సొంతింటి వారే ప్రత్యర్థులుగా మారిన ఈ పోరు చర్చనీయాంశంగా మారింది. అటు ఆదిలాబాద్(D) బరంపూర్లో 69 ఏళ్ల(ఏకగ్రీవం) తర్వాత జరిగిన ఎన్నికల్లో BRS అభ్యర్థి దేవరావు గెలిచారు.


