News July 6, 2024

ఆ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలి: నిరంజన్ రెడ్డి

image

TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ నేతలకు ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేదా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాసినట్లు మీడియాతో పేర్కొన్నారు. దీనిపై ఆయన స్పందించాలని కోరారు. ఆరు గ్యారంటీల ఊసెత్తకుండా ఇలాగే పాలన కొనసాగితే ప్రజలు ఉపేక్షించరని దుయ్యబట్టారు.

Similar News

News December 23, 2025

కస్టమర్ల మనసు గెలవడానికి ఇన్‌స్టామార్ట్ స్మార్ట్ స్టెప్!

image

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఫిజికల్ స్టోర్స్ తెరుస్తోంది. నేరుగా వెళ్లి వస్తువులు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్వాలిటీ చూపించి కస్టమర్లలో నమ్మకం పెంచడానికి చేస్తున్న చిన్న ప్రయోగం ఇది. స్పీడ్ మాత్రమే కాదు, క్వాలిటీ కూడా బాగుంటుందని చెప్పడానికి గురుగ్రామ్‌(HR)లో ఈ ‘ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌’ను ప్రారంభించింది. ఈ స్మార్ట్ స్టెప్ సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా మరిన్ని సెంటర్స్‌ రానున్నాయి.

News December 23, 2025

రైతు కన్నీరు.. దేశానికి ముప్పు!

image

రైతు <<18647657>>దినోత్సవ<<>> వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నా గిట్టుబాటు ధర లేక రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటుండటం కలిచివేస్తోంది. అప్పుల ఊబిలో పడి ఏటా వేల సంఖ్యలో చనిపోతుండటం ఆందోళనకరం. లోకానికి అన్నం పెట్టేవాడు ఆకలి, అవమానంతో ప్రాణాలు వదులుతుంటే ‘జై కిసాన్’ అనే నినాదం మనల్ని వెక్కిరిస్తోంది. పొలం గట్టున రైతు ప్రాణం గాలిలో కలిసిపోతుంటే ఆ పక్కనే ఉన్న పైరు రోదిస్తోంది. రైతు ఆత్మహత్య లేని రోజే దేశానికి నిజమైన పండుగ.

News December 23, 2025

గుచ్చి మష్రూమ్స్ కేజీ రూ.40 వేలు.. ఎక్కడ పెరుగుతాయి?

image

మంచు కరిగే సమయం, వింటర్ చివరిలో గుచ్చి మష్రూమ్స్ (మొరెల్స్/మోర్చెల్లా ఎస్కులెంటా) సహజంగా పెరుగుతాయి. HP, ఉత్తరాఖండ్, J&K ప్రాంతాల్లో లభిస్తాయి. తడి నేల, రాలిన ఆకుల కింద, దట్టమైన అడవిలో మొరెల్స్ పెరుగుతాయి. సంప్రదాయ వైద్యంతోపాటు ఖరీదైన వంటకాల్లో వినియోగం, అంతర్జాతీయ డిమాండ్‌తో కేజీ రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో వారాలపాటు వెతికితే కొంత మొత్తంలో లభిస్తాయి.